విభజనపై లోకేష్ ఆసక్తికరం, జగన్ పార్టీకి అనురాధ వార్నింగ్
కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ గురువారం మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు
అమరావతి: కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ గురువారం మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి ఏం చెప్తారన్నారు.
చంద్రబాబుకు వెంకయ్య నాయుడు ఝలక్
లోకేష్ను అనే హక్కు లేదు: అనురాధ
మంత్రి నారా లోకేశ్పై విమర్శలు చేసే అర్హత వైసిపి నేతలకు లేదని టిడిపి నాయకురాలు, మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్ పర్సన్ పంచుమర్తి అనురాధ అన్నారు.
లోకేశ్ అత్యున్నత చదువులు చదివి ప్రజాసేవలోకి వచ్చారని, మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకే వైసిపి బురద జల్లుతోందన్నారు.
ప్రజా సంపదను దోచుకోవడమే నైజంగా పెట్టుకున్న జగన్, నాకిది-నీకిది విధానంతో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. లోకేశ్పై అసత్య ఆరోపణలు ఆపకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.