రాజ్యసభకు నాగబాబు ఎంపికలో ఢిల్లీ ట్విస్ట్ - ఆ ముగ్గురు ఖరారు..!!
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలకు కూట మి నుంచి అభ్యర్ధుల ఎంపిక పైన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీ నుంచి ఖాళీ చేసిన ముగ్గురు అభ్యర్ధుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ వర్గానికి చెందిన వారు కావటంతో కూటమి నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. తొలుత నాగబాబు రాజ్యసభ ఖాయమని భావించినా.. ఢిల్లీ జోక్యంతో ఏపీ నుంచి ఎంపికయ్యే సభ్యుల విషయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి.
ముగ్గురి ఎంపిక
ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయటంతో ఈ మూడు స్థానాలు దక్కేదెవరికనే చర్చ మొదలైంది. తొలి నుంచి కూటమిలో ఉన్న మూడు పార్టీలకు మూడు స్థానాలు పంచుకుంటాయని అంచనాలు ఉన్నాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. గత ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తొలుత భావించినా.. బీజేపీ అభ్యర్ధనతో ఆ సీటు సీఎం రమేశ్ కు కేటాయించారు. దీంతో, నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించారు. అయితే, ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

టీడీపీ జనసేన నుంచి
ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో బీదా మస్తాన రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయటం ఖాయమైంది. ఆ హామీతోనే మస్తాన రావు వైసీపీకి రాజీనామా చేసారు. మూడు స్థానాల్లో బీసీలకు ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో, బీదాకు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయదేవ్ అభ్యర్దిత్వం పైన పవన్ సైతం అంగీకారం తెలిపారని సమాచారం. ఇదే స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నారు. అదే విధంగా సానా సతీశ్ పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది. అటు టీడీపీ, జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీశ్ కు మద్దతు లభిస్తోంది.

బీజేపీ తాజా ప్రతిపాదన
దీంతీ, నాగబాబు లేదా సానా సతీశ్ లో ఒకరు జనసేన కోటాలో ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. సానా సతీశ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్యుల నుంచి కీలక వర్తమానం అందినట్లు సమాచారం. బీజేపీ నుంచి తొలుత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. అయితే, ఢిల్లీ నేతలు తాజాగా కేంద్ర మంత్రివర్గం లోని ఒక నేత పేరు సూచించినట్లు సమాచారం. రాజ్యసభ కాలపరిమితి ముగియనున్న ఆ మంత్రి కి ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు, పవన్ సైతం ఆమోదం తెలిపారు. దీంతో, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ లేదా కంభంపాటి రామ్మోహన్ లో ఒకరికి.. అదే విధంగా జనసేన నుంచి సానా సతీశ్..చివరి నిమిషంలో సమీకరణాలు మారితే నాగబాబు పేర్లు ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications