అమ్మాయిల్ని ఎరగా, నగ్న దృశ్యాలు తీసి టీవీ యాంకర్ బ్లాక్మెయిల్
అనంతపురం: అమ్మాయిలను మోసం చేసి వ్యభిచారకూపంలోకి లాగడం, అబ్బాయిలను ట్రాప్ చేసి, అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఓ స్థానిక టీవీ ఛానల్ యాంకర్ పైన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కదిరి పోలీసులు సదరు యాంకర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలుస్తోంది. ఆమె నుండి ఓ కంప్యూటర్, మూడు మెమోరీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
ఈమె బారినపడిన ఓ యువతి కొద్ది రోజులుగా కనిపించడం లేదు. ఆమె ఓ ఉత్తరం రాసి పెట్టి వెళ్లింది. సదరు యాంకర్ తనను వ్యభిచారంలోకి దింపిందని, నగ్న దృశ్యాలను చిత్రీకరించి వాట్సప్ ద్వారా చాలామందికి పంపించిందని పేర్కొంది.
పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకొని విచారించారని సమాచారం. యాంకర్గా చెబుతున్న ఆమె స్థానికంగా న్యూస్ రీడర్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
సదరు టీవీ యాంకర్ అమ్మాయిలను ఎరగా వేసి అబ్బాయిలను ట్రాప్ చేస్తోంది. వీడియో తీసి అబ్బాయిలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఆమె విషయం బయటకు చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక అబ్బాయిలు ఆమెకు డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారని తెలుస్తోంది.