ఏపీ సర్కార్ కు NHRC నోటీసులు-కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేయడంపై..!
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో తాజాగా ఓ మహిళ భర్త అప్పు తీర్చలేదనే కారణంతో ఆమెను ఓ వడ్డీ వ్యాపారి చెట్టుకు కట్టేసి ఆమె పిల్లల ముందే కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం అదే రోజు స్పందించి చర్యలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై ఏపీ సర్కార్ కు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ నెల 16న కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో తన భర్త రుణం తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఒక మహిళను చెట్టుకు కట్టేసి ప్రజల సమక్షంలో కొట్టాడని మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియా కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వయంగా పరిశీలించినట్లు పీఐబీ ఓ ప్రకటనలో తెలిపింది. మీడియా కథనాలు వాస్తవం అయితే తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో కుప్పం ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది.

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2137951
బాధితురాలి భర్త దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్థానిక వడ్డీ వ్యాపారి నుండి రూ.80,000 అప్పు తీసుకున్నాడు. కానీ దానిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. అతను గ్రామంలోని ఇతరుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అతను అప్పులు తిరిగి చెల్లించలేక గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుండి అతని భార్య రోజువారీ కూలీగా పనిచేస్తూ తనను, ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. అలాగే వాయిదాలలో అప్పుల్ని చెల్లిస్తోంది. ఇదే క్రమంలో కుమారుడి స్కూల్లో టీసీ తీసుకునేందుకు వచ్చిన ఆమెను పట్టుకుని మునిస్వామి అనే వ్యాపారి చెట్టుకు కట్టేసి ఆమె పిల్లల ముందే కొట్టాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్టు చేసి ఆమెకు 5 లక్షలు పరిహారం కూడా ఇచ్చింది.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications