చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నితీశ్ గైర్హాజరు - అసలు కారణం..!!
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. 25 మంది మంత్రులతో ఎన్డీఏ కూటమి కొలువు తీరింది. ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ - సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో మాూడు పార్టీల అభిమానుల ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. చిరంజీవి, రజనీకాంత్ కార్యక్రమంలో ప్రత్యేకార్షణగా నిలిచారు. అయితే, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ ముఖ్య నేత నితీశ్ గైర్హాజరయ్యారు. దీని వెనుక కారణాల పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. కేంద్రంలో టీడీపీ, జేడీ(యూ)కీలకంగా ఉన్నాయి. ఫలితాలు వచ్చిన సమయం నుంచి ప్రధాని మోదీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం వరకు చంద్రబాబు - నితీశ్ అన్నింటా ముఖ్య భూమిక పోషించారు. కేంద్ర కేబినెట్ లో రెండు పార్టీలు రెండు పదవులు కేంద్రంలో దక్కాయి. చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా నితీశ్ ను ఆహ్వానించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలను స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రధాని మోదీతో సహా అమిత్ షా, గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రులు..ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నితీశ్ రాకపోవటం వెనుక కారణం ఏంటనేది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో చర్చ జరుగుతోంది. నితీవ్ కేంద్రంలో తమకు ఇచ్చిన మంత్రి పదవుల సంఖ్య , శాఖల పైన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే రాలేదని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే...ప్రధాని మోదీ ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబుకు తాను ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో స్పష్టం చేసారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత ఆలింగనం చేసుకొని అభినందించారు. ఎన్డీఏలో ఎంపీ స్థానాల సంఖ్యా పరంగా బీజేపీ తరువాతి స్థానంలో టీడీపీ ఉంది. అయితే, నితీశ్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటం పైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications