సంచలనం కోసమే ఎంపీల అవిశ్వాసం: పొన్నాల

Ponnala Laxmaiah
న్యూఢిల్లీ: సంచలనం కోసమే తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అవిశ్వాసం పెడితే సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఎవరూ కూలదోయరని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ మాత్రమే ఉంటుందని, ఓటింగు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ బిల్లుపై శాసనసభలో ఓటింగు జరగదని, సభ్యుల అభిప్రాయాల సేకరణ మాత్రమే ఉంటుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు సోనియా గాంధీపై తమ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.

ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నవారికి ఇకనైనా కాంగ్రెసు పార్టీ నుంచి ఉద్వాసన పలకాలని ఆయన అన్నారు. అధికారం కోసం వచ్చిన కొందరు నాయకులు పార్టీని విమర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను ఆయన కలిశారు.

జెసి దివాకర్ రెడ్డికి మతిభ్రమించిందని నల్లగొండ జిల్లా ఆలేరు శానససభ్యుడు బూడిద బిక్షమయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. జెసి కోరుకున్న రాయల తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ మంచివారయ్యేవారని ఆయన వ్యాఖ్యానించారు. యువ నాయకత్వాన్ని కోరుతున్న జెసి తప్పుకుని యువకుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+