అమరావతిలో రెండో విడత భూసమీకరణ సై- ఆ గ్రామాలు ఇవే
రాజధాని అమరావతి భూసమీకరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. రెండో విడత భూసమీకరణకు పూనుకుంది. ఇదివరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన ప్రతిపాదనలకు అనుగుణంగా మలిదశ సమీకరణ దిశగా ముందడుగు వేసింది.
రెండో విడత భూసమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ పరిధిలోకి వచ్చే ఏడు గ్రామాల్లో తాజా భూసమీకరణ చోటు చేసుకుంది. ఈ విడతలో మొత్తం 16,666.56 ఎకరాలను సమీకరించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇదివరకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాలగు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందనేతి అర్థమౌతోంది.

మొదటి విడతలో 34,400 ఎకరాలు సేకరించిన సీఆర్డీఏ. తాజాగా 16,666.56 ఎకరాలతో ఈ సంఖ్య 50,000 చేరినట్టయింది. రాజధాని నిర్మాణం కోసం మొదటి విడత భూసమీకరణలో మొత్తం 28,526 మంది రైతులు 34,400 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించారు. 16,000 ఎకరాల ప్రభుత్వ భూమితో కలుపుకొని మొత్తం 74,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరుగనుంది. రాజధాని ప్రాంతంలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ 16,666 ఎకరాల భూమిని సమీకరించనుంది.
ఇందులో సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడిల్లో 7,562 ఎకరాలు ఉన్నాయి. అలాగే వడ్డేమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలు సమీకరిస్తుంది ప్రభుత్వం. ఆయా గ్రామాల్లో 3,828 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. రెండో విడతలో భాగంగా ఈ భూమి మొత్తాన్నీ కూడా సమీకరిస్తుంది ప్రభుత్వం. ఈ విడతలో భూములు ఇచ్చిన రైతులకు కూడా గతంలో అమలు చేసిన పరిహారాలే వర్తిస్తాయి. జరీబు భూమికి నివాస స్థలం 1,000, వాణిజ్య ప్లాటు 450 గజాలు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది. మెట్ట భూములకు నివాస స్థలం 1,000, వాణిజ్య ప్లాటు 250 గజాలు పరిహారంగా ఇస్తుంది.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications