ఎన్టీపీసీలో నాలుగు యూనిట్లు ట్రిప్ - నిలిచిన విద్యుత్ ఉత్పత్తి : 2 వేల మెగావాట్ల మేర..!!
విశాఖలోని సింహాద్రి, హిందూజా ఎన్టీపీసీ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దక్షిణాది గ్రిడ్ లో తలెత్తిన లోపం కారణంగా విద్యుదుత్పత్తి ఆగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాంకేతికలోపం తలెత్తడంతో.. విద్యుతుత్పత్తి నిలిచింది. గ్రిడ్కి విద్యుత్ ప్రసార లైన్లలో ఏర్పడిన సమస్య వల్ల అకస్మాత్తుగా ప్లాంట్లలోని విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. పరిసరప్రాంతాలు అంధకారంగా మారాయి. దాదాపు రెండు గంటల తర్వాత గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా తిరిగి ఆరంభం కావడంతో సింహాద్రిలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.
హిందూజాలోనూ విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. అత్యవసర ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఒకేసారి సింహాద్రి నాలుగు యూనిట్లు, హిందూజా రెండు యూనిట్లు ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే తొలిసారి. ఎండా కాలంలో ఇలాంటి లోపాలు తలెత్తడం వల్ల రాష్ట్రంలో మరింతగా విద్యుత్ కోతలు సంభవించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దీని పైన అధికారులు వివరణ ఇచ్చారు.

భారీ గాలులు, వర్షం వల్ల 2 సబ్స్టేషన్లు ట్రిప్ అయ్యాయని ఎన్టీపీసీ తెలిపింది. కలపాక, గాజువాక సబ్స్టేషన్లు ట్రిప్ అయినట్లు పేర్కొంది. నేషనల్ గ్రిడ్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ట్రిప్ కారణంగా 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని వెల్లడించింది. ఎన్టీపీసీలో ఉత్పత్తయ్యే విద్యుత్ 2 సబ్స్టేషన్ల నుంచి గ్రిడ్కు వెళ్లాల్సి ఉందని.. 2 సబ్స్టేషన్లు ట్రిప్ కావడంతో సింహాద్రిలోని 4 యూనిట్లు ట్రిప్ అయ్యాయని వివరించింది.
సాయంత్రంలోపు అన్ని యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. 1, 4 యూనిట్లు విద్యుదుత్పత్తికి సిద్ధమైనట్లు తెలిపింది. కాసేపట్లో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొంది. 2, 3 యూనిట్లలో మరమ్మతులు చివరి దశలో ఉన్నాయని ప్రకటించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications