వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!
వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా... తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ గడువు ఇప్పటికే పెంచేసారు. డెలవరీ మాత్రం ఆలస్యం అవుతోంది. యుద్ద కారణంగా భారీగా ధరలు పెంచినా.. సరఫరా మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మెరుగు పడలేదు. బుకింగ్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. దీంతో.. వంట గ్యాస్ బుకింగ్ చేయాలంటే కొన్ని నిబంధనలు తప్పని సరి చేస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
వంట గ్యాస్ బుకింగ్ ఇప్పుడు వినియోగదారులకు సమస్యగా మారుతోంది. బుకింగ్ గడువు పెంచిన కంపెనీలు డెలివరీ మాత్రం ఆలస్యం చేస్తున్నాయి. ఇప్పుడు కనీసం బుక్ చేద్దామన్నా కొన్నిసార్లు అవ్వడం లేదు. సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. ఆందోళన అవసరం లేదని ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో, గ్యాస్ బుకింగ్ సేవలను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి గ్యాస్ బుక్ చేయాలం టే ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని చెబుతోంది. ఇది వరకు రాయితీ డబ్బుల జమ కోసం మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉండగా, ప్రస్తుతం గ్యాస్ బుక్ చేయాలన్నా ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. అప్పటిలోగా వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.

ఈ కేవైసీ ఈ నెల 31 లోగా పూర్తి చేయాల్సిందే
కాగా, ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వినియోగదారులకు మరోసారి అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చేయని వారు మాత్రం ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని సూచిస్తుంది. వినియోగదారులు మీ-సేవ, గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కేవైసీ విధానం అమలు చేయటం ద్వారా వంట గ్యాస్ కష్టాల వేళ సరఫరా వ్యవస్థ పక్క దారి పట్టకుండా నియంత్రించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వంట గ్యాస్ సంస్థలకు చెందిన మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ-కేవైసీ ప్రక్రియను ఫ్రీగా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇందుకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి. సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ప్రక్రియను పూర్తి చేసుకోవ చ్చని అధికారులు వెల్లడించారు. ఈ నెల 31 లోగా ఈ కేవైసీ పూర్తి చేయనివారు రాయితీతో పాటు గ్యాస్ బుక్ చేసే అవకాశాన్నీ కోల్పోతారని అధికారులు స్పష్టం చేసారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక













Click it and Unblock the Notifications