పాకిస్తాన్ చేతులు ముడుచుకొని కూర్చోలేదు, అణ్వాయుధాలు ఉన్నాయి: పీవోకేపై మళ్లీ ఫరూక్ అబ్దుల్లా
జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా బుధవారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీఓకే పాకిస్థాన్కే చెందుతుందంటూ ఇటీవల దుమారం రేపింది.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా బుధవారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీఓకే పాకిస్థాన్కే చెందుతుందంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. పీఓకేను భారత్ తీసుకుంటుంటే చూస్తూ ఊరుకునేంత బలహీనమైన దేశం పాకిస్థాన్ కాదన్నారు. పీఓకే మన భూభాగమని ఎన్నాళ్లు చెబుతామని, ఆ ప్రాంతం పాకిస్థాన్దని అన్నారు.

పీవోకే భారత్లో అంతర్భాగమని చూస్తూ ఊరుకోవడానికి పాక్ గాజులు తొడుక్కొని కూర్చోలేదని, వాళ్లేం బలహీనులు కారని, పాక్ దగ్గర అణుబాంబులు ఉన్నాయన్నారు. యుద్ధం గురించి ఆలోచించే ముందు ఇక్కడ మనుషులుగా బతగ్గలమా ఆలోచించాలన్నారు.












Click it and Unblock the Notifications