Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ గా రాబోతున్న దుర్గమ్మ చీర..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం పూజ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు సమర్పించిన పట్టు చీర తిరిగి ఆయన వద్దకే చేరబోతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నెల 25న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ప్రచారం కోసం తాను తయారు చేయించుకున్న వారాహి వాహనానికి పూజల కోసం ఆయన అమ్మవారి ఆలయానికి వచ్చారు. వాహన పూజకు ముందు ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి అమ్మవారికి ఓ పట్టు చీర సమర్పించారు. అనంతరం పూజలు చేసుకుని కిందకు వచ్చేశారు. కొండ దిగువన వారాహికి పూజ పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ అమ్మవారికి సమర్పించిన చీరను వేలం వేసినప్పుడు దాన్ని జనసేన పార్టీ నేత గంటా స్వరూప దేవి కొనుగోలు చేశారు. చీర ఖరీదుకే దాన్ని కొనుగోలు చేసిన స్వరూప దాని వెనుక మరో ఉద్దేశం ఉందని చెప్పారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు సమర్పించిన చీరను కొనుగోలు చేసి తిరిగి ఆయనకే పంపబోతున్నట్లు స్వరూప వెల్లడించారు. అయితే దీని వెనుక సదుద్దశమే ఉందన్నారు.

అమ్మవారిని తాకిన చీరను పవన్ కళ్యాణ్ కు ఇస్తే ఆయనకు విజయం వరిస్తుందనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు చీరను కొనుగోలు చేసిన జనసేన పార్టీ మహిళా నేత గంటా స్వరూప దేవి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే గంటా స్వరూప ఈ చీరను వేలంలో కొనుగోలు చేసి ఆయనకు పంపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ వైపు నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా అమ్మవారిని తాకిన చీరను తీసుకోవడం ద్వారా తన విజయానికి పనికొస్తుందని పవన్ భావిస్తుండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications