పార్టీ నిర్మాణంలో పవన్ బిజీ, పార్టీపై 'ఇజం' బుక్(ఫోటో)

కాగా, జనసేన పార్టీ ఐడియాలజీతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుస్తకం రాశారు. ఇజం (ఐఎస్ఎం) పేరుతో పవన్ కళ్యాణ్ పుస్తకం విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పుస్తకాన్ని తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి రాశారు. దీనిని ఈ నెల 25వ తేదీన ఆవిష్కరించనున్నారని సమాచారం.

పుస్తకం కవర్ పేజీ పైన జనసేన పార్టీ గుర్తు ఉంది. ఈ పుస్తకాన్ని పవన్, రాజా రవితేజలు ఐదేళ్లుగా రాస్తున్నారని సమాచారం. ఇందులో పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కవర్ పేజీని మీడియాకు విడుదల చేశారు.
కాగా, పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం జనసేన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ తన రెండు గంటల ప్రసంగంలో కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబానికి చురకలు వేశారు. కాంగ్రెసును గెలవకుండా చేసేందుకు చంద్రబాబుతో సహా ఎవరినైనా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు.












Click it and Unblock the Notifications