మీ బెదిరింపుకు భయపడను, మీపై నమ్మకం కోల్పోయా, చంద్రబాబు గురించి వసుంధర అడిగారు: పవన్
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం ఇచ్ఛాపురంలో జన పోరాట యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై, టీడీపీపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరోక్ష చురకలు అంటించారు. తాను సీఎం అయితేనే అన్నీ చేస్తానని చెప్పనని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు కానీ ప్రజలను మోసం మాత్రం చేయనని చెప్పారు. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తనకు ఓ బాధ ఉందన్నారు. నరేంద్ర మోడీ నాడు పార్లమెంటుకు మొక్కి లోపలకు అడుగుపెడితే ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుతారని భావించానని చెప్పారు. ప్రజలంతా ఏకమైతే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు.

నేను గెలుస్తానో లేదో తెలియదు కానీ
తాను సమస్యలపై నిజాయితీగా మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు కానీ మోసం మాత్రం చేయనని చెప్పారు. రైతు రుణమాఫీ సహా ఏ హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఇన్ని హామీలు ఇస్తున్నారు ఎలా నెరవేరుస్తారని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తనను అడిగారని చెప్పారు.

పదవులు కావాలనుకుంటే అప్పుడే తీసుకునేవాడిని
డబ్బులు సంపాదించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని, ఉన్న డబ్బులు పోయినా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తనకు టీడీపీ, ఇతర పార్టీలు వస్తే తీసుకునే వాడినన్నారు. 2009 ఎన్నికల్లోనే నేను ఎమ్మెల్యేగానో, ఎంపీగానో అయ్యేవాడినన్నారు. 2014 ఎన్నికల్లోను నేను చంద్రబాబుకు మద్దతివ్వడానికి కారణం ఉందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుభవం ఉన్న నాయకుడు కావాలని టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు.

మీ బెదిరింపులకు నేను భయపడను
ప్రత్యేక హోదా గురించి మొట్టమొదటిసారి నిలదీసింది జనసేన మాత్రమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ టీడీపీ మాత్రం ప్యాకేజీకి స్వాగతించిందన్నారు. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నేను నమ్మిన ప్రజలను మోసం చేయనని చెప్పారు. మీ బెదిరింపులకు నేను భయపడనని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతించి, ఇప్పుడు మీరు యూ టర్న్ తీసుకున్నారన్నారు. అమరావతిలో బీజేపీ నేతలకు సన్మానాలు చేశారన్నారు. ఇప్పుడు బీజేపీకి పవన్ కళ్యాణ్కు లింక్ పెడుతున్నారన్నారు. బీజేపీ నాకు బంధువేమీ కాదన్నారు.

మీ మీద నాకు నమ్మకం పోయింది
ప్యాకేజీ పైన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ వేసేదాకా చంద్రబాబు మేల్కొనలేదని పవన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్నో రకాలుగా మాటలు మార్చారని మండిపడ్డారు. హోదా, ప్యాకేజీపై ఇన్ని రకాల మాటలు మాట్లాడిన మీ మీద నాకు నమ్మకం పోయిందని చెప్పారు. అసలు బీజేపీకి లొంగిపోతోందని మీరన్నారు. హోదాపై ఇన్నిసార్లు మాట మార్చడం వల్ల మీపై నమ్మకం పోయిందన్నారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications