పవన్ కళ్యాణ్కు 'మెగా' స్వాగతం, పూలవర్షం, తోపులాట: పోలీసులు తీసుకెళ్లారు
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు.
విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, మెగా అభిమానులు తరలి వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలోని ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించనున్నారు. రేపు ఉదయం రోడ్డు మార్గాన ఆయన విశాఖ నుంచి బయలుదేరి వెళ్లి, పరామర్శిస్తారు.

ఇందుకోసం సోమవారం సాయంత్రం ఆయన విశాఖ చేరుకున్నారు. పవన్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో విమానాశ్రయం కిటకిటలాడింది. పవన్ను చూసేందుకు అందరూ ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. ఆ తర్వాత పోలీసుల రక్షణ మధ్య పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయటకు వెళ్లారు.


పూలవర్షం కురిపించారు
ఇచ్చాపురంలో ఉద్దానం ప్రాంతంలో పర్యటనను పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం విశాఖ చేరుకున్న పవన్కు మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయన పైన పూలవర్షం కురిపించి, ఆహ్వానం పలికారు.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!










Click it and Unblock the Notifications