రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన .. రీజన్ ఇదే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమర సైనికుల కోసం కోటి రూపాయల విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్ ఈ చెక్కును సైనికాధికారులకు అందించనున్నారు. కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి కోటి రూపాయల విరాళాన్ని అందించిన అనంతరం పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం ఇండియన్ స్టూడెంట్ పార్లమెంటు సదస్సులో పాల్గొననున్నారు .

కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయంలో కోటి విరాళం అందజేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 20వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి రెండు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇటీవల మిలటరీ డే సందర్భంగా అమరులైన సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక విరాళాన్ని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అక్కడ సైనికాధికారులకు అందించనున్నారు.

విజ్ఞాన భవన్ లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొననున్న పవన్
ఇక ఆ తర్వాత మధ్యాహ్నం విజ్ఞాన భవన్ లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకుల అవసరాన్ని ఉద్దేశించి నిర్వహిస్తున్న ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ గురించి రూపొందించిన ఒక షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారు. పవన్ యువతను ఉద్దేశించి, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి యువత ఏవిధంగా ముందుకు రావాలో ప్రస్తావిస్తూ సదస్సులో మాట్లాడనున్నారు.

రాజకీయాల మార్పు కోసం యువత రావాల్సిన అంశంపై పవన్ స్పీచ్
అదేవిధంగా విద్యార్థుల సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తారని తెలుస్తోంది. వివిధ పార్టీల నుండి కీలక నాయకులు పాల్గొంటున్న ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నట్లు గా జనసేన పేర్కొంది . ఇక ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. ఒకపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోపక్క ఏపీ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల కోసం పర్యటనలు సాగిస్తూనే, ఇంకోపక్క పలు కీలక కార్యక్రమాలలో సైతం భాగస్వామ్యం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications