రేపు ఇచ్చాపురంలో పవన్ రోడ్ షో: ఏర్పాట్లపై జనసేన ఫోకస్..
ఇచ్చాపురం నిర్వహించే 'రోడ్ షో' తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి జనం ముందుకు రానున్నారు.
శ్రీకాకుళం: రాయలసీమ బహిరంగ సభ తర్వాత శ్రీకాకుళంలో నిర్వహించే 'రోడ్ షో' తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి జనం ముందుకు రానున్నారు. మంగళవారం నాడు పవన్ శ్రీకాకుళం పర్యటన ఖరారైన సందర్బంగా.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ ముమ్మరంగా జరుగుతున్నాయి.
జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పర్యటన సందర్బంగా.. తొలుత జిల్లాలోని ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను పవన్ పరామర్శించనున్నారు. స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

ఆయన పరామర్శించబోయే రోగుల జాబితాను ఇప్పటికే జనసేన కార్యకర్తలు సిద్దం చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల పరామర్శ అనంతరం అక్కడే నిర్వహించే రోడ్ షో లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని జనసేన శ్రేణులు మీడియాకు వెల్లడించాయి.
ట్విట్టర్ ద్వారా పవన్ స్పందన:
ఉత్తర కోనసీమగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో గత ఇరవై ఏళ్లలో 20వేల మందికి పైగా మృత్యువాతపడ్డారని జనసేన అధ్యక్షుడు పవన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇక్కడ లక్షల మంది ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నా ్రపభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జనసేన పార్టీ తరుపున కొంతమంది విలేకరుల బృందం అక్కడి ప్రజలను కలుసుకుని వారి సమస్యలపై ఓ డాక్యుమెంటరీ తయారు చేసిందని పవన్ వెల్లడించారు.
జనసేన రూపొందించిన ఈ వీడియోను చూసి అక్కడి ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందిగా పవన్ కోరారు. కాగా, ఆయన ఈ సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. రేపు ఉద్దానంలో కిడ్నీ పేషెంట్స్ ను పరామర్శ అనంతరం రోడ్ షో లో పాల్గొంటారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications