రేపు ఇచ్చాపురంలో పవన్ రోడ్ షో: ఏర్పాట్లపై జనసేన ఫోకస్..
ఇచ్చాపురం నిర్వహించే 'రోడ్ షో' తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి జనం ముందుకు రానున్నారు.
శ్రీకాకుళం: రాయలసీమ బహిరంగ సభ తర్వాత శ్రీకాకుళంలో నిర్వహించే 'రోడ్ షో' తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి జనం ముందుకు రానున్నారు. మంగళవారం నాడు పవన్ శ్రీకాకుళం పర్యటన ఖరారైన సందర్బంగా.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ ముమ్మరంగా జరుగుతున్నాయి.
జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పర్యటన సందర్బంగా.. తొలుత జిల్లాలోని ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను పవన్ పరామర్శించనున్నారు. స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

ఆయన పరామర్శించబోయే రోగుల జాబితాను ఇప్పటికే జనసేన కార్యకర్తలు సిద్దం చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల పరామర్శ అనంతరం అక్కడే నిర్వహించే రోడ్ షో లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని జనసేన శ్రేణులు మీడియాకు వెల్లడించాయి.
ట్విట్టర్ ద్వారా పవన్ స్పందన:
ఉత్తర కోనసీమగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో గత ఇరవై ఏళ్లలో 20వేల మందికి పైగా మృత్యువాతపడ్డారని జనసేన అధ్యక్షుడు పవన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇక్కడ లక్షల మంది ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నా ్రపభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జనసేన పార్టీ తరుపున కొంతమంది విలేకరుల బృందం అక్కడి ప్రజలను కలుసుకుని వారి సమస్యలపై ఓ డాక్యుమెంటరీ తయారు చేసిందని పవన్ వెల్లడించారు.
జనసేన రూపొందించిన ఈ వీడియోను చూసి అక్కడి ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందిగా పవన్ కోరారు. కాగా, ఆయన ఈ సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. రేపు ఉద్దానంలో కిడ్నీ పేషెంట్స్ ను పరామర్శ అనంతరం రోడ్ షో లో పాల్గొంటారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications