మేమిస్తాం: చైనా బృందం భేటీ, కేసీఆర్ హ్యాపీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో 660-1000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన డాంగ్ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ (డిఇసి) ముందుకు వచ్చింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో డిఇసి అంతర్జాతీయ హన్ జిహిక్యూ, మేనేజింగ్ డైరెక్టర్ లెంగ్ జైన్, జనరల్ మేనేజర్ (థర్మల్) జహంగ్ హంగ్, డిఇసి ఇండియా ప్రతినిధి ఎస్కె బాన్ భేటీ అయ్యారు.
డిఇసి ప్రస్తుతం 30 దేశాలలో 100 విద్యుత్ ప్రాజెక్టులకు విద్యుత్ పరికరాలను సమకూర్చుతోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరతను తీర్చడానికి డిఇసి తన వంతుగా ఇక్కడ 660 నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్థతను వ్యక్తం చేసింది.
డిఇసికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు డిఇసి ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. తమ సంస్థ తెలంగాణలో ఏర్పాటు చేయబోయే విద్యుత్ ప్రాజెక్టులకు పరికరాలను అందజేయడానికి కూడా డిఇసి బృందం సుముఖతను వ్యక్తం చేసింది.

కేసీఆర్తో చైనా ప్రతినిధులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మంగళవారంనాడు చైనాకు చెందిన డాంగ్ఫాంగ్ ఎలక్ట్రికల్ కార్పోరేషన్ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు.

కేసీఆర్తో చైనా ప్రతినిధులు
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణలో 660 నుంచి వేయి మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ముందుకు వచ్చారు.

కేసీఆర్తో చైనా ప్రతినిధులు
వారి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారు. డాంగ్ఫాంగ్ కంపెనీకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.

కేసీఆర్తో చైనా ప్రతినిధులు
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చైనాలోని కంపెనీని సందర్సించేందుకు ఆసక్తి కనబరిచినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

కేసీఆర్తో చైనా ప్రతినిధులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మంగళవారంనాడు చైనాకు చెందిన డాంగ్ఫాంగ్ ఎలక్ట్రికల్ కార్పోరేషన్ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు.

కేసీఆర్తో చైనా ప్రతినిధులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మంగళవారంనాడు చైనాకు చెందిన డాంగ్ఫాంగ్ ఎలక్ట్రికల్ కార్పోరేషన్ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు.

కేసీఆర్తో చైనా ప్రతినిధులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మంగళవారంనాడు చైనాకు చెందిన డాంగ్ఫాంగ్ ఎలక్ట్రికల్ కార్పోరేషన్ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు.












Click it and Unblock the Notifications