గవర్నర్పై ఆసక్తి: వాళ్లు ఇలా వచ్చి వెళ్లారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆగస్టా వెస్ట్ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ల కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను ప్రశ్నించారు. ఈ స్థితిలో గవర్నర్ ఏం చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నరసింహన్ను ఈ కేసులో సిబిఐ అధికారులు సాక్షిగానే విచారించారు.
ఆగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు సమయంలో నరసింహన్ నిఘా విభాగం అధిపతిగా ఉన్నారు. ఈ కేసులో సాక్షులుగా ప్రశ్నలు ఎదుర్కున్న ఎంకె నారాయణన్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి, వాంచూ గోవా గవర్నర్ పదవికి రాజీనామాలు చేశారు.
నరసింహన్ కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సిబిఐ అధికారులు రాజభవన్కు వచ్చిన సందర్భంలో వారిని కెమెరాలో బంధించడానికి మీడియా ఫొటోగ్రాఫర్లు తీవ్రంగా ప్రయత్నించారు.

ఇలా వచ్చి వెళ్లారు...
ఆగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు గవర్నర్ నరసింహన్ను సాక్షిగా ప్రశ్నించిన తర్వాత ఇలా వెళ్లిపోయారు.

ఇలా వచ్చి వెళ్లారు...
సిబిఐ అధికారులను తమ కెమెరాల్లో బంధించడానికి మీడియా ఫొటోగ్రాఫర్లు తీవ్రంగా ప్రయత్నించారు. వారు వాహనాన్ని మాత్రమే ఫొటో తీయగలిగారు.

ఇలా వచ్చి వెళ్లారు...
గవర్నర్ నరసింహన్ను ఆగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో ప్రశ్నించిన తర్వాత సిబిఐ అధికారులు ఇలా వాహనాల్లో వెళ్లిపోయారు.

గవర్నర్ రాజీనామా చేస్తారా..
సిబిఐ అధికారులు ఆగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో తనను ప్రశ్నించిన నేపథ్యంలో గవర్నర్ పదవికి నరసింహన్ రాజీనామా చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications