మరో 20 మంది అరెస్ట్ - రెచ్చగొడితే చర్యలు తప్పవు : రాజకీయంగా..!!
ప్రశాంతంగా ఉండే కోనసీమలో చోటు చేసుకున్న విధ్వంసంతో అందరూ ఉలిక్కి పడ్డారు. గత నెల 24న జరిగిన ఆందోళనలు - విధ్వంసం లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అనేక మార్గాల ద్వారా ఆ విధ్వంసానికి కారకులైన వారిని గుర్తిస్తున్న పోలీసులు తాజాగా మరో 20 మందిని అరెస్ట్ చేసారు. దీంతో..ఇప్పటి వరకు ఈ ఘటనలో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 111కి చేరింది. ఇక, జిల్లా వ్యాప్తంగా అదే రోజు నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేసారు. వాట్సప్ సందేశాల ద్వారా ముందుస్తుగా సిద్దం చేసుకున్న ప్రణాళిక మేరకు అల్లర్లకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది.

కొనసాగుతున్న అరెస్టుల పర్వం
దీంతో.. ఆ రోజు నుంచి ఇప్పటికీ ఇంకా కొన్ని మండలాల్లో ఇంటర్నెట్ సేవల పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా, కొన్ని మండలాల్లో మాత్రం పునరుద్దరించారు. అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం, అల్లవరం మినహా మిగతా మండలాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా అమలాపురంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. సున్నితమైన అంశం కావటంతో.. పోలీసులు విచారణ సమయంలో.. నిర్ధారణకు వచ్చిన అంశాల్లో నూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయంగానూ ప్రభుత్వం పైన ఈ ఘటన పైన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి.

విధ్వంసం .. రాజకీయ విమర్శలు
ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టింగులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి. ఇప్పటికే విధ్వంసంలో పాల్గొన్న టీడీపీ - జనసేనకు చెందిన వారి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసారు. ఇక, ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఇదంతా కోనసీమలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మథ్య ఘర్షణగా ఆరోపిస్తున్నారు.

పోలీస బందోబస్తు.. ఆచితూచి నిర్ణయాలు
ఇందులో ఇతరులకు సంబంధం లేదని చెబుతున్నారు. మంత్రి విశ్వరూప్ సైతం ఈ ఘటనలో బాధితుడే అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఈ ఘటన పైన సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని..డీజీపీ ఎందుకు ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లలేదని నిలదీస్తున్నారు. అటు వైసీపీ నేతలు సైతం ఈ ఘటన వెనుక టీడీపీ - జనసేన ఉందంటూ కౌంటర్ విమర్శలు చేస్తున్నారు. ఇక, పోలీసులు కోనసీమలో తిరిగి ఎటువంటి అలజడికి అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ పోలీసు అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications