రాజోలు సీటును జనసేన నిలబెట్టుకోనుందా ? పొలిటికల్ క్రిటిక్ సర్వే లో షాకింగ్..
ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన స్ధానాల్లో గెలిచిన ఏకైక సీటు అప్పటి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మాత్రమే. ఇక్కడ జనసేన అభ్యర్ధిగా రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. ఇది మినహా రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని సీట్లను జనసేన కోల్పోయింది. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లోనూ ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత అక్కడ సీన్ మారిపోయింది.
2019 ఎన్నికల్లో రాజోలు నుంచి గెలిచిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆనంతరం వైసీపీలోకి ఫిరాయించేశారు.జనసేనకు క్రమంగా దూరమవుతూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. చివరికి రాజోలు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధిగా ఖాయమైపోయారు. దీంతో గతంలో ఆయనపై పోటీ చేసి ఓటమిపాలైన వైసీపీ అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావు జనసేనలోకి ఫిరాయించారు. ఈసారి బొంతు రాజేశ్వరరావును అక్కడి నుంచి ఎలాగైనా గెలిపించుకోవాలని జనసేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రాజోలు సీటులో ఎవరు గెలవబోతున్నారనే దానిపై పొలిటికల్ క్రిటిక్ సర్వే వెల్లడించింది.

ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రాజోలు అసెంబ్లీ సీటులో ఈసారి ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ గెలవబోతున్నట్లు పొలిటికల్ క్రిటిక్ సర్వే వెల్లడించింది. అలాగే ఈ నియోజకవర్గంలో వైసీపీ మళ్లీ ఓటమిపాలవుతున్నట్లు సర్వే రిపోర్టు చెబుతోంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన రాజోలులో కాపుల జనాభా కూడా ఎక్కువ ఉండటం ఈ ఫలితానికి కారణమవుతున్నట్లు అర్ధమవుతోంది. అలాగే ఈ సీటులో ఏ పార్టీ ఎంత ఓటు శాతం తెచ్చుకోబోతోందన్నదీ ఈ రిపోర్ట్ వెల్లడించింది.
Assembly Constituency Wise Survey Results.
— Political Critic (@PCSurveysIndia) September 2, 2023
🔹️Razole(SC): Andhrapradesh #PCSurveysIndia #AndhraPradeshElection2024 #AndhrapradeshPolitics #CBN #TDP #YSJagan #YSRCP #Pawankalyan #JSP #NaraLokesh #BJP #Congress pic.twitter.com/Rr2AEGkFEC
పొలిటికల్ క్రిటిక్ సర్వే ప్రకారం రాజోలు సీటులో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య పోటీ జరగబోతోంది. ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తాయని అనుకుంటే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో ఈ సర్వే వెల్లడించింది. దీని ప్రకారం లక్షా 86 వేల ఓట్లున్న ఈ గ్రామీణ నియోజకవర్గంలో జనసేన 36.85 శాతం ఓట్లు తెచ్చుకుని విజయం సాధించే అవకాశం ఉంది. రెండో స్ధానంలో ఉన్న వైసీపీకి 32.99 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అలాగే టీడీపీకి 27.81 శాతం ఓట్లు రాబోతున్నట్లు సర్వే వెల్లడించింది. దీంతో రాజోలు సీటును జనసేన నిలబెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications