ఏపీకి వెళ్లిపోండి!: జగన్కు ప్రశాంత్ కిషోర్ సూచన, 'సాక్షి' కూడా...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన సూచనతో పార్టీతో పాటు సాక్షి టీవీ వ్యవస్థను పెంచి, నవ్యాంధ్రకు తరలించనున్నారంటున్నారు.
విభజన అనంతరం జగన్ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి రావడం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, సచివాలయం అమరావతికి తరలింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు జగన్ విజయవాడ తరలనున్నారు.

సిద్ధమవుతున్న వైసిపి ఆఫీస్
ఇప్పటికే వైసిపి కార్యాలయం సిద్ధమవుతోంది. కాబట్టి విజయవాడలో సాక్షి మీడియా వ్యవస్థను కూడా పెంచడం అనివార్యమవుతుందని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతో జగన్, జగన్ సూచనలతో సాక్షి టీవీ వ్యవస్థ కదలనుంది.

ఏపిలో సెంట్రల్ డెస్క్
అయితే, సాక్షి మీడియా ఏపీ జనరల్ డెస్క్ జగన్ సూచనలతో విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమవుతోందంటున్నారు. సెంట్రల్ ఆఫీసు, హెడ్ ఆఫీస్ హైదరాబాదులో ఉన్నాయి. విజయవాడలో ఆఫీస్, ఎడిషన్ సెంటర్ వంటివి ఉన్నాయి. ప్రింటింగ్ కూడా అక్కడే. ఏపీ జనరల్ రిపోర్టింగ్ బ్యూరో కూడా ఏపీ నుంచే పని చేస్తోంది.

సాక్షి టీవీ వ్యవస్థను బెజవాడలో..
సాక్షి టీవీ వ్యవస్థను విజయవాడలో అప్ గ్రేడ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాల కొందరు రాజకీయ ప్రముఖులు హైదరాబాదులోనే ఉండటంతో ఇబ్బంది ఉండటం లేదు.

అందుకే..
కానీ రానున్న కాలంలో వారంతా విజయవాడకు తరలుతారు. మరోవైపు, జగన్ కూడా బెజవాడ తరలుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి టీవీ వ్యవస్థను పెంచడం అనివార్యంగా మారింది.
-
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications