జగన్ ఎంపీల దారెటు ? ఏపీ, తెలంగాణ వివాదాలొస్తే ? నిరంజన్, కృష్ణయ్యలతో సమస్యలివే !
ఏపీలో వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్ధుల్లో ఇద్దరు తెలంగాణ వారు ఉండటంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఏపీ-తెలంగాణ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో రాజ్యసభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై వీరు ఎలా పోరాడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో ఎంతో మంది సమర్ధులు, విధేయులు ఉండగా వారిని కాదని జగన్ నిరంజన్ రెడ్డితో పాటు ఆర్.కృష్ణయ్యను ఎలా ఎంపిక చేస్తారనే వాదన వినిపిస్తోంది.

జగన్ ఎంపీల ఎంపిక
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్ధానాలకు జరిగే ఎన్నికల కోసం వైసీపీ నలుగురు అభ్యర్ధుల్ని ప్రకటించింది. వీరిలో పాత కాపు విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. మరో మూడు సీట్లలో నెల్లూరు బీసీ నేత బీద మస్తాన్ రావుతో పాటు తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు చోటు కల్పించారు. దీంతో వీరిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే వీరి ఎంపికలో రాష్ట్రాన్ని కూడా పట్టించుకోకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణకు చెందిన వీరిద్దరూ ఏపీకి ఎలా న్యాయం చేస్తారన్న వాదన వినిపిస్తోంది.

ఎంపీ అభ్యర్ధుల తెలంగాణ నేపథ్యం
వైసీపీ తెలంగాణ నుంచి ఎంపిక చేసిన ఇద్దరు ఎంపీ అభ్యర్ధులు నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఇప్పటికే ఏపీకి వ్యతిరేకులుగానో,సంబంధం లేని వ్యక్తులుగానో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకూ ఏపీకి చేసిన సేవ కానీ, ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వారు కానీ కాదు. అలాగే గతంలో తెలుగు ప్రజల కోసం ఉమ్మడిగా వీరిద్దరూ ఎక్కడా పనిచేసిన దాఖలాలు కూడా లేవు. కానీ సాంకేతికంగా చెల్లుబాటు అవుతుందన్న కారణంతో మాత్రమే వీరిద్దరినీ జగన్ ఎంపిక చేసేశారు. వీరిలో కృష్ణయ్య వంటి వారికి గతంలో ఏపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన చరిత్ర కూడా ఉంది.

ఏపీ, తెలంగాణ వివాదాల్లో వీరెటు ?
ఏపీ, తెలంగాణ మధ్య గత కొన్నేళ్లుగా అగాధం పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, నేతలు జల వివాదాలతో మరింత దూరం అయ్యారు. ఇప్పటికీ కేటీఆర్ వంటి వారు ఏపీలో మౌలిక సౌకర్యాలపై విమర్శలు చేస్తే ఏపీ మంత్రులంతా వరుసగా కౌంటర్లు ఇచ్చారు.చివరికి కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలతో పాటు జల వివాదాలు కూడా ఇంకా సమసిపోలేదు. ఇప్పటికీ పార్లమెంటులో ఇరు రాష్ట్రాల ఎంపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి, కృష్ణయ్యలను చాలా సులువుగా రాజ్యసభకు ఏపీ నుంచి పంపుతున్నారు. భవిష్యత్తులో వీరు ఏపీ,తెలంగాణ వివాదాలు వస్తే ఎటు నిలబడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి మాత్రం వైసీపీ దగ్గర సమాధానం లేదు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications