'హత్యలకు చంద్రబాబే కారణం': 'ఏం చెప్తే ఉమ దానికి తలూపుతారు'
చిత్తూరు: గోదావరి పుష్కరాలలో తొలి రోజున 27 మందిని బలిగొన్న తొక్కిసలాటకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు లేకుండా పుష్కరాలు ప్రారంభించారని ఆరోపించారు.
తన అర్భాటం కోసమే రూ.1500 కోట్లు గోదావరిలో పోశారని మండిపడ్డారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టింది ప్రజల ప్రాణాలు తీసేందుకా అన్నారు. ఇది దోపిడీ ప్రభుత్వమని, హోల్ సేల్ల కోసం జన్మభూమి కమిటీలు వేసిందన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు.
చంద్రబాబుపై దేవినేని నెహ్రూ ఆగ్రహం

గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ట్రాఫిక్ ఎస్సైలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ మండిపడ్డారు. పుష్కరాల్లో చంద్రబాబు అసమర్థత వల్ల రాష్ట్రం పరువు పోయిందన్నారు. రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు రాజమండ్రికే పరిమితమయ్యారన్నారు.
రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద ఇంజనీర్ అయితే, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చిన్న ఇంజనీర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏది చెబితే దానికి ఉమ తల ఊపుతుంటారన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications