నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం: మృతులు వీరే
హైదరాబాద్: నాందేడ్ - బెంగళూర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మరణించినవారిని గుర్తించే కార్యక్రమం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 26 మంది మరణించారు. మృతుల్లో కొందరిని గుర్తించారు.
మంటల్లో మృతదేహాలు గుర్తు పట్టరానంతగా కాలిపోయాయి. కర్నూలు జిల్లాలోని ఆదోనీ టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ బసవరాజు, ఆయన కూతురు సర్వమంగళం ప్రమాదంలో మరణించారు. సర్వమంగళం కౌతాళంలో టీచర్గా పనిచేస్తున్నారు. ప్రమాదం నుంచి బసవరాజు భార్య అన్నపూర్ణమ్మ, అల్లుడు చరణ్ బయటపడినట్లు తెలుస్తోంది.

బసవరాజు, అన్నపూర్ణమ్మ తమ కుమారిడికి బెంగళూర్ వెళ్లి పెళ్లి సంబంధం చూసి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అనంతపురం, ధర్మవరం ఆస్పత్రుల్లో చెన్నైకి చెందిన విజిత, తనుశ్రీ, నటేష్, మైసూరుకు చెదిన విజయ, బెంగుళూర్కు చెందిన తనూజ చికిత్స పొందుతున్నారు. మృతుల్లో బెంగుళూర్రు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతులు వీరే
బసవరాజు (కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
సర్వమంగళం (కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
అనిల్ కుమార్ (ముంబై)
మధు (బెంగళూర్)
రాంప్రసాద్ (బెంగళూర్)
అనిల్ కులకర్ణి, లలిత, పద్మజ (బెంగళూర్)
గణేష్ (హైదరాబాద్)
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications