ప్రయాణికుల కోసం రైల్వే మరో సదుపాయం
రైళ్లలో ప్రయాణించే వారికి కోసం రైల్వే శాఖ (Indian Railway) కొత్తగా మరో సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ (Whatsapp) ద్వారా కూడా ఈ సేవలను పొందే సౌకర్యం కల్పించింది. ఈ-కేటరింగ్ సేవలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ముందుగా కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో వీటిని అమలు చేస్తున్నారు.
irctc ప్రస్తుతం www.ecatering.irctc.co.in, ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తోంది. ఇప్పుడు 87500 01323 అనే వాట్సాప్ నెంబర్ను అందుబాటులో ఉంచింది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగానే ఈ నెంబర్ నుంచి ఈ-కేటరింగ్ సర్వీస్ సేవలకు సంబంధించి www.ecatering.irctc.co.in వెబ్సైట్ లింక్ వస్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న స్టేషన్లలో తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ కేటరింగ్కు సంబంధించిన సేవలను ఏఐ ఆధారిత చాట్బోట్ నేరుగా అందజేస్తుంది.

ప్రస్తుతం irctc ఈ-కేటరింగ్ ద్వారా రోజుకు 50 వేల భోజనాలను ప్రయాణికులకు అందజేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే వీటిని అదుబాటులోకి తెచ్చారు. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా మిగిలిన రైళ్లకు కూడా దీన్ని వర్తింపచేయాలని అధికారులు యోచిస్తున్నారు. జూప్ అనే థర్డ్పార్టీ ఆన్లైన్ పుడ్ ప్లాట్ఫాం గత సంవత్సరం వాట్సాప్ చాట్బోట్ ద్వారా రైళ్లలోకి ఆహారాన్ని అందించే సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications