Tiger: ఆరు రోజులుగా పెద్ద పులి సంచారం.. రెస్క్యూ బృందం రంగంలోకి!
గత ఆరు రోజులుగా జిల్లావ్యాప్తంగా సంచరిస్తూ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్న పులి (Tiger) ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఇప్పటికే అటవీ శాఖ బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తుండగా, తాజాగా పుణె కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వన్యప్రాణుల సంరక్షణ సంస్థ 'రెస్క్యూ' రంగంలోకి దిగింది. గురువారం రెండు ప్రత్యేక వాహనాల్లో ఐదుగురు నిపుణులు రాజమహేంద్రవరం చేరుకుని, స్థానిక అటవీ అధికారులతో సమన్వయం ప్రారంభించారు.
నిన్న కూడా పులి సంచార జాడలు కొన్ని ప్రాంతాల్లో కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు, గ్రామాల వద్ద గస్తీని పెంచారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రాకుండా సూచనలు జారీ చేశారు. ఇదే సమయంలో, పులి కదలికలపై స్పష్టమైన సమాచారం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Tiger కోసం అత్యాధునిక టెక్నాలజీతో వేట..
పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఏఐ (కృత్రిమ మేథ) ఆధారిత విశ్లేషణను ఉపయోగించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రక్రియ నుంచి, దాని పునరావాసం వరకు అన్ని దశలను నిర్వహించగల నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. 2007లో పుణె కేంద్రంగా ఏర్పడిన 'రెస్క్యూ' సంస్థ లాభాపేక్ష లేకుండా పనిచేస్తూ, ఇప్పటివరకు 230కి పైగా వన్యప్రాణి జాతులను సంరక్షించిన ఘనత సాధించింది. 2024 వరకు ఈ సంస్థ 7,293 వన్యప్రాణులకు చికిత్స, సంరక్షణ చేసి తిరిగి సహజావాసాలకు చేర్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కెమెరాలు.. డ్రోన్లు.. కట్టుదిట్టమైన నిఘా
పులి జాడను ఖచ్చితంగా గుర్తించేందుకు ఇప్పటికే 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి జంతువు కదలికలను మెమరీ కార్డుల్లో నమోదు చేస్తాయి. అదనంగా, ముంబయి నుంచి తెప్పించిన పది 4జీ కెమెరాలు పులి కనిపించిన క్షణాల్లోనే ఫొటోలు, లొకేషన్ వివరాలను నేరుగా అధికారుల మొబైల్ ఫోన్లకు పంపేలా అమర్చారు.
రాత్రి వేళల్లో గమనిక కోసం థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వెలుతురు లేకపోయినా, పులి శరీర ఉష్ణోగ్రత ఆధారంగా దాని కదలికలను గుర్తించి తక్షణ సమాచారం అందేలా ఈ డ్రోన్లు పనిచేస్తాయి. అలాగే, పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్న ప్రాంతాల్లో మూడు చోట్ల ఏర్పాటు చేసిన ట్రాప్ కేజ్ల వద్ద పీటీజడ్ (PTZ) కెమెరాలు అమర్చారు. బోనులో పులి చిక్కుకున్న వెంటనే సంబంధిత అధికారులకు అలర్ట్ వెళ్లే విధంగా వ్యవస్థ రూపొందించారు.
అటవీ శాఖ, రెస్క్యూ నిపుణులు కలిసి తీసుకుంటున్న ఈ సమన్వయ చర్యలతో త్వరలోనే పులిని సురక్షితంగా పట్టుకుని, ప్రజలకు భద్రత కల్పిస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications