Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tiger: ఆరు రోజులుగా పెద్ద పులి సంచారం.. రెస్క్యూ బృందం రంగంలోకి!

గత ఆరు రోజులుగా జిల్లావ్యాప్తంగా సంచరిస్తూ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్న పులి (Tiger) ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఇప్పటికే అటవీ శాఖ బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తుండగా, తాజాగా పుణె కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వన్యప్రాణుల సంరక్షణ సంస్థ 'రెస్క్యూ' రంగంలోకి దిగింది. గురువారం రెండు ప్రత్యేక వాహనాల్లో ఐదుగురు నిపుణులు రాజమహేంద్రవరం చేరుకుని, స్థానిక అటవీ అధికారులతో సమన్వయం ప్రారంభించారు.

నిన్న కూడా పులి సంచార జాడలు కొన్ని ప్రాంతాల్లో కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు, గ్రామాల వద్ద గస్తీని పెంచారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రాకుండా సూచనలు జారీ చేశారు. ఇదే సమయంలో, పులి కదలికలపై స్పష్టమైన సమాచారం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Rajamahendravaram Tiger Capture Operation Intensifies with AI Drones and Rescue Experts Coordinating Efforts

Tiger కోసం అత్యాధునిక టెక్నాలజీతో వేట..

పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఏఐ (కృత్రిమ మేథ) ఆధారిత విశ్లేషణను ఉపయోగించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రక్రియ నుంచి, దాని పునరావాసం వరకు అన్ని దశలను నిర్వహించగల నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. 2007లో పుణె కేంద్రంగా ఏర్పడిన 'రెస్క్యూ' సంస్థ లాభాపేక్ష లేకుండా పనిచేస్తూ, ఇప్పటివరకు 230కి పైగా వన్యప్రాణి జాతులను సంరక్షించిన ఘనత సాధించింది. 2024 వరకు ఈ సంస్థ 7,293 వన్యప్రాణులకు చికిత్స, సంరక్షణ చేసి తిరిగి సహజావాసాలకు చేర్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కెమెరాలు.. డ్రోన్లు.. కట్టుదిట్టమైన నిఘా

పులి జాడను ఖచ్చితంగా గుర్తించేందుకు ఇప్పటికే 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి జంతువు కదలికలను మెమరీ కార్డుల్లో నమోదు చేస్తాయి. అదనంగా, ముంబయి నుంచి తెప్పించిన పది 4జీ కెమెరాలు పులి కనిపించిన క్షణాల్లోనే ఫొటోలు, లొకేషన్ వివరాలను నేరుగా అధికారుల మొబైల్ ఫోన్లకు పంపేలా అమర్చారు.

రాత్రి వేళల్లో గమనిక కోసం థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వెలుతురు లేకపోయినా, పులి శరీర ఉష్ణోగ్రత ఆధారంగా దాని కదలికలను గుర్తించి తక్షణ సమాచారం అందేలా ఈ డ్రోన్లు పనిచేస్తాయి. అలాగే, పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్న ప్రాంతాల్లో మూడు చోట్ల ఏర్పాటు చేసిన ట్రాప్ కేజ్‌ల వద్ద పీటీజడ్ (PTZ) కెమెరాలు అమర్చారు. బోనులో పులి చిక్కుకున్న వెంటనే సంబంధిత అధికారులకు అలర్ట్ వెళ్లే విధంగా వ్యవస్థ రూపొందించారు.

అటవీ శాఖ, రెస్క్యూ నిపుణులు కలిసి తీసుకుంటున్న ఈ సమన్వయ చర్యలతో త్వరలోనే పులిని సురక్షితంగా పట్టుకుని, ప్రజలకు భద్రత కల్పిస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+