బాబు, కేసీఆర్ భేటీపై రాంమాధవ్, టీలో మాదే అధికారం

 Ram Madhav on KCR and Chandrababu meeting
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు భేటీ అయి సమస్యల పైన చర్చించడం శుభపరిణామమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై సీఎంలిద్దరూ మాట్లాడుకుంటే కేంద్రంపై భారం తగ్గుతుందన్నారు.

ముఖ్యమత్రుల భేటీ విషయంలో గవర్నర్ కృషి ప్రశంసనీయమన్నారు. ఇలాంటి సమావేశాలు తరుచుగా జరగాలని కోరుకుంటున్నానని, సీఎంల భేటీ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ అధ్యక్షులుగా అమిత్ షా తొలి పర్యటన తెలంగాణలోనని, దీన్ని బట్టి బీజేపీ తెలంగాణకు ఇచ్చే ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చునన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఆదివారం సీఎంల భేటీ శుభపరిణామమన్నారు. కేంద్ర, రాష్ట్రాలు టీమిండియాలు పని చేయాలన్నారు. ఏపీ కొత్త రాజధాని పైన వివాదం వద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+