బాబు, కేసీఆర్ భేటీపై రాంమాధవ్, టీలో మాదే అధికారం

ముఖ్యమత్రుల భేటీ విషయంలో గవర్నర్ కృషి ప్రశంసనీయమన్నారు. ఇలాంటి సమావేశాలు తరుచుగా జరగాలని కోరుకుంటున్నానని, సీఎంల భేటీ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ అధ్యక్షులుగా అమిత్ షా తొలి పర్యటన తెలంగాణలోనని, దీన్ని బట్టి బీజేపీ తెలంగాణకు ఇచ్చే ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చునన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఆదివారం సీఎంల భేటీ శుభపరిణామమన్నారు. కేంద్ర, రాష్ట్రాలు టీమిండియాలు పని చేయాలన్నారు. ఏపీ కొత్త రాజధాని పైన వివాదం వద్దన్నారు.












Click it and Unblock the Notifications