తెలంగాణలో భూకంపం.. అర్ధరాత్రి దాటక: ఉరుకులు

తెలంగాణలో వేకువజామున భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అందలేదు. దీని ధాటికి స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు సంభవిస్తోండటంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. చాలాసేపటివరకు ఆరుబయటే గడిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వేకువజామున 2:26 నిమిషాలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.8గా నిర్ధారించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. 17.492° ఉత్తర అక్షాంశం, 80.894° తూర్పు రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గర్తించింది. భద్రాచలానికి నైరుతి దిశగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న భారీ కదలికల నేపథ్యంలో భూమి ప్రకోపించింది.

Earthquake Today Magnitude 3 8 On Richter Scale Tremor Hits Bhadradri Kothagudem of Telangana

తొలుత భూకంప తీవ్రతను 3.5గా అంచనా వేసినా, తర్వాత దాన్ని 3.8గా సవరించారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా సుమారు 25 నిమిషాల పాటు ప్రకంపనలు సంభవించాయి. మోడిఫైడ్ మెర్కల్లి ఇంటెన్సిటీ స్కేల్ ప్రకారం భూకంప కేంద్రం పరిసర ప్రాంతాలు జోన్ 4 పరిధిలోకి వస్తుంది.

భూకంప కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని పాల్వంచలో తేలికపాటి ప్రకంపనలు రికార్డయ్యాయి. భద్రాచలం- 20, సారపాక- 22, సత్తుపల్లి- 27, కొత్తగూడెం- 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

ఈ భూకంపంతో సుమారు 3.2 x 1010 జౌల్స్ శక్తి విడుదలైనట్లు అంచనా. ఇది 8.78 మెగావాట్ అవర్స్ లేదా 7.56 టన్నుల టీఎన్టీకి సమానమని సిస్మిక్ లెక్కలు చెబుతున్నాయి. ఇంతకుముందు 2022 ఫిబ్రవరి 18న ఇదే ప్రాంతంలో భూమి కంపించింది. అప్పట్లో దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3 రికార్డయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+