రేషన్ కార్డు దారులకు శుభవార్త , నేటి నుంచి కొత్తగా - ధరలు ఫిక్స్..!!
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ సరఫరాలో కీలక మార్పులు తీసుకొచ్చింది. రేషన్ వాహనాల స్థానంలో తిరిగి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా స్మార్ట్ కార్డుల ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక.. రేషన్ సరఫరాలో ఇప్పుడు కొత్త మార్పులు తెస్తోంది. నేటి నుంచి కొత్తగా మరిన్ని సరుకులు అందిస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డు దారులకు కీలక సూచనలు చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి రేషన్ కార్డు దారుల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల్లో ఇకపై బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా అందించనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో రూ.20కే గోధుమ పంపిణీ చేయనుంది. ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో అందించనుండగా.. త్వరలో డివిజన్, మండల స్థాయిలో కూడా పంపిణీ చేయనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు రేషన్ కార్డు దారులకు కేజీ రూ.20కే అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇప్పుడు ఆదివారం నుంచి గోధుమ పండి కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా ఒక్కో లబ్దిదారుడికి కిలో చొప్పున గోధుమ పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ లో గోధుమ పిండి దాదాపు రూ 60 నుంచి రూ 65 వరకు ఉంది. రేషన్ షాపుల ద్వారా రూ 20 కే అందించనున్నారు.

కీలక మార్పులు
రేషన్ కార్డు దారులకు ప్యాకెట్ల ద్వారా ఈ పిండిని అందించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గోధుమ పిండి ప్యాకెట్లను రేషన్ షాపులకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేసింది. వీటిని డీలర్లు లబ్దిదారులకు నేటి నుంచి అందించనున్నారు. రేషన్ సరుకుల జాబితాలో మరో నిత్యావసర వస్తువును చేర్చడంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి రేషన్ షాపుల ద్వారా రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం బియ్యం కోటాను తగ్గించి వీటిని లబ్దిదారులకు అందిస్తోంది. ఇక రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే కార్యక్రమానికి సిద్దమైంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు నగరాలను ఎంచుకున్నారు. ఇక్కడ సుమారు 12 గంటల పాటు షాపు తెరిచి ఉంచుతారు. ప్రస్తుతం నెలలో కేవలం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications