వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 సీట్లలో విన్, కిరణ్ కరెక్ట్: రాయపాటి, బొత్సపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆదివారం కితాబిచ్చారు. రాష్ట్ర విభజనపై కిరణ్ చెప్పినవన్నీ వాస్తవాలే అన్నారు. ముఖ్యమంత్రి వాదనలో నిజం ఉందన్నారు. తమను రాజీనామా చేయొద్దని చెబుతున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాను రాజీనామాకు ఎలా సిద్ధపడుతున్నారని ప్రశ్నించారు.

తమ కొత్త పార్టీకి సమయం రాలేదన్నారు. తాను ఢిల్లీకి రావడం ఆలస్యం కావడంతో సభాపతిని కలవలేకపోయానని, తాను స్పీకర్‌ను కలిసి రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కాంగ్రెసులో విలీనం చేయరన్నారు.

తెలంగాణ ఇస్తే కాంగ్రెసు ఎన్ని స్థానాలలో గెలుస్తుందో సమైక్యంగా ఉంటే అంతకంటే ఎక్కువ సీమాంధ్రలో గెలుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెసు సీమాంధ్రలో ఇరవై ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. సీనియర్లను కాదని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోను రాదని చెప్పారు.

English summary
Guntur MP Rayapati Sambasiva Rao on Sunday praised Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X