కంటైనర్ బాక్సుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ (పిక్చర్స్)
విశాఖపట్నం: దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతూ పట్టుబడింది. రెవెన్యూ, కస్టమ్స్ అధికారులు అప్రమత్తమై కంటైనర్ టెర్మినల్లోని బాక్సులను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఎర్ర చందనం సరిహద్దులు దాటుతూ పట్టుబపడింది. ఎర్రచందనం కలప స్మగ్లర్ ఎవరనేది తేల్చేందుకు క్రైం ఏడిసిపి నేతృత్వంలో ముగ్గురితో ఓ కమిటీ ఏర్పడింది.
గురువారంనాటి తనిఖీల్లో స్మగ్లింగ్కు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం పట్టుబడడం కలవరానికి గురి చేసంది. విశాఖపట్నంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి వచ్చిన కంటైనర్లో ఎర్రచందనాన్ని ఉంచి వెనక అనుమానం రాకుండా ఐస్ గడ్డలు ఉంచారు.
ఎర్రచందనం పట్టుబడిన నేపథ్యంలో రెవెన్యూ ఇంటలిజెన్స్ ఉద్యోగులపై నిఘా పెంచారు. కంటైనర్ బాక్సులపై అనుమానం వచ్చి కస్టమ్స్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై అన్నింటినీ పరిశీలించారు. కొన్ని బాక్సుల సీళ్లు కూడా తెరిచారు.
ఎర్రచందనం స్మగ్లింగ్
ఇటీవలి కాలంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ అనేది హాట్ టాపిక్గా మారింది. విశాఖ నుంచి కంటైనర్ బాక్సుల్లో స్మిగ్లింగ్కు సిద్ధమైన ఎర్ర చందనాన్ని పట్టుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్
ఎర్రచందనం స్మిగ్లింగ్ జరుగుతూ పట్టుబడడం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది. కంటైనర్ బాక్సులన్నింటిపై అనుమానాలు తలెత్తాయి.
ఎర్ర చందనం స్మిగ్లింగ్
ఎర్ర చందనం కలపలను బాక్సుల్లో పెట్టి అనుమానం రాకుండా ఐస్ గడ్డలు పెట్టారు. అయితే, వాటిని కస్టమ్స్, రెవెన్యూ అధికారులు గుర్తించారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్
ఎర్ర చందనం స్మగ్లింగ్కు పాల్పడుతూ పట్టుబడిన కంటైనర్ బాక్సులు ఎవరవి అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్
విశాఖపట్న నుంచి సరిహద్దులు దాటడానికి సిద్ధంగా ఉన్న ఎర్ర చందనం కలపను అధికారులు పట్టుకున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్
దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసే ఎర్ర చందనం అధికారుల చేతికి చిక్కింది. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
ఎర్ర చందనం స్మగ్లింగ్
విశాఖపట్నం నుంచి తరలిపోవడానికి సిద్ధపడిన కంటైనర్ బాక్సులన్నింటిపై అధికారులకు అనుమానాలు తలెత్తాయి.
ఎర్ర చందనం స్మగ్లింగ్
కంటైనర్ బాక్సులను అన్నింటినీ అధికారులు తెరిచి చూశారు. అయితే, మిగతావాటిలో అటువంటిదేమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్
అనుమానంతో అధికారులు కొన్ని కంటైనర్ బాక్సుల సీళ్లు కూడా తెరిచారు. ఈ నేపథ్యంలో నిఘా పెంచారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్
విశాఖపట్నం నుంచి ఎర్ర చందనాన్ని స్మగుల్ చేయడానికి చేసిన ప్రయత్నం బయటపడడం తీవ్ర కలకలం సృష్టించింది.