ఏపీ పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు 8 రోజుల పాటు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో విడుదల చేశారు. వాస్తవానికి ఈ నెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో అది కాస్తా 31కి మారింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే:
తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1,
ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1
ఏప్రిల్ 6న ఇంగ్లీష్ పేపర్-2
ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1
ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్-2
ఏప్రిల్ 9న జనరల్ సైన్స్ పేపర్-1
ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2,
ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్-1,
ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ పేపర్-2,
Recommended Video

ఏప్రిల్ 16న ఓఎస్ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2, 17న ఒకేషనల్ కోర్సుల పరీక్ష ఉంటుంది. పరీక్షల మధ్యలో మొత్తం ఐదు రోజులు సెలవులు రానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.












Click it and Unblock the Notifications