చంద్రబాబు లో ఎందుకీ అసహనం : ఆ ఇద్దరినీ పక్కనే పెట్టుకున్నారు : రోజా ఫైర్..!
ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా వైసిపి ఎమ్మెల్యేల రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రికి అసహనం పెరి గి పోయిందని ఆరోపించారు. వైఎస్ జగన్ను సినీ నటుడు నాగార్జున కలిస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అసహనం పెరిగిపోయిందని అందుకే.. వైఎస్ జగన్ను సినీ నటుడు నాగార్జున కలిస్తే ఓర్వలేకపోతున్నారన్నారు. నేర చరిత్ర కలిగిన వారిని పక్కన పెట్టుకుం ది చంద్రబాబేనని, సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనదేనని విమర్శించారు. చంద్రబాబుపై 18 కేసు లు ఉన్నా... నేటికి విచారణకు హాజరు కాకుండా తిరుగుతున్నారన్నారు. ఇంట్లో బాంబులు పేల్చిన కోడెల శివప్రసాద రావు, గన్ పేల్చిన బాలకృష్ణను పక్కన పెట్టుకుంది చంద్రబాబు కాదా..అని రోజా ప్రశ్నించారు.

కుట్రలతో జగనజ్ పై కేసులు..
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్పై కుట్రపూరితంగా కేసులు పెట్టాయన్నారు. అయినా వైఎస్ జగన్ విచారణకు హాజరై అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది చంద్రబాబేనని, అందుకే ఆపరేషన్ గరుడ ప్లాన్తో వైఎస్ జగన్ను హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా చంద్ర బాబు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో ప్రజలు గమనిస్తున్నారని, ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. అలాగే రౌడీ చింతమనేనికి విప్ పదవి ఇచ్చి జనాలపై వదిలారని, జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే హత్యాయత్నం చేశారని రోజా అన్నారు.
-
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని












Click it and Unblock the Notifications