మొక్కులు చెల్లించిన రోజా
ఆడికృతిక.. తమిళులకు అత్యంత పవిత్రమాసం. కృతిక నక్షత్రం సుబ్రహ్మణ్యస్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఆడికృతిక రోజున సుబ్రహ్మణ్వేశ్వరుడిని భక్తిశ్రద్థలతో పూజిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు అంతటా సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడం కూడా కలిసొచ్చింది. తమిళనాడులోని ప్రఖ్యాత పళని, తిరుత్తణి, తిరుచెందూర్, స్వామిమలై.. వంటి చోట్ల గల మురుగన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాల ముందు బారులుతీరి నిల్చున్నారు.

ఆడి మాసంలో రెండు కృత్తిక నక్షత్రాలు వచ్చాయి. జూలై 20న తొలిసారిగా కృతిక నక్షత్రం నాడు ఈ వేడుకలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీన ముగియనున్నాయి. నేడు- తిరుత్తణి, తిరుచెందూర్, పళని వంటి ఆలయాల్లో ఆడికృతిక ఉత్సవాలను జరుపుకొంటోన్నారు భక్తులు. తిరుప్పరంకుండ్రంలో ఈ నెల 20వ తేదీన ఈ ఉత్సవాలు జరుగుతాయి.
ఆడికృతికను పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా.. తిరుత్తణి ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ వెలిసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావడి మొక్కులను చెల్లించుకున్నారు.
అంతకుముందు- నగరిలోని తన నివాసం నుంచి పుష్ప కావడి పూజలు జరిపారు. కావడితో తిరుత్తణికి బయలుదేరి వెళ్లారు. ప్రతి సంవత్సరం ఆడికృతిక నాడు క్రమం తప్పకుండా కావడి మోయడం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయాన్ని దర్శించడం రోజా ఆనవాయితీ.
ఈ సంవత్సరం కూడా తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని ముక్కు చెల్లించుకుని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట కుటుంబ సభ్యులు, నగరి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రోజాకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
కాగా ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం శ్రీవారి సారె సమర్పించారు. ఈ సందర్భంగా తిరుత్తణి ఆలయ ఛైర్మన్ శ్రీధర్, తమిళనాడు దేవాదయశాఖ జాయింట్ కమిషనర్ రమణి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications