ఏపీ రాజధాని అమరావతికి రూ.7 కోట్ల భారీ విరాళం
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం పంచాయతీరాజ్ ఛాంబర్ రూ.7.77 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికు మంగళవారం నాడు అందించింది.
శాసన సభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం ఆ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో ఛాంబర్ ప్రతినిధులు చంద్రబాబుని కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. జిల్లా పరిషత్తు ఛైర్మన్లు, జడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు వారి ఒక నెల గౌరవ వేతనాన్ని ఇస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా రోడ్డెక్కనున్న 3వేల బస్సుల
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆర్టీసీ ఎండీ సాంబశివ రావు బుధవారం భేటీ అయ్యారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల ఏర్పాటుకు సీఎం అనుమతి మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా మూడు వేల బస్సులు రోడ్డెక్కనున్నాయి.
ప్రయాణికులు సురక్షిత ప్రయాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ప్రయాణికులపై భారం పడకుండా ఆదాయ మార్గాలు ఆలోచించాలన్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెంచడం, ఇతర మార్గాలపై ఆలోచించాలని, ఆర్టీసీ లాభాల బాటలో నడిపించేలా చర్యలు చేపట్టాలన్నారు.