ఆ ఫీడ్ బ్యాక్ తో వైసీసీకి కొత్త ఊపు..!!
ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. దీన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నిర్ణీత షెడ్యూల్లోగా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తిచేయాలని సూచించారు.
ఆదివారం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్), పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జల అన్నారు. ఇదే ఊపుతో నియోజకవర్గం, మండలం, గ్రామస్ధాయి వరకు దీన్ని తీసుకుని వెళ్ళాలని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసుకుంటూ అన్ని చోట్లా దిగ్విజయం చేయాలని సూచించారు.
సుపరిపాలన తొలి అడుగు పేరుతో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారని, వాళ్లను నిలదీయాలంటే రీకాలింగ్ టీడీపీ మేనిఫెస్టో కార్యక్రమం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి కావాలని అన్నారు. ప్రస్తుతం మనం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ స్ధాయిలో మన కార్యక్రమం జరుగుతుందని, ఆ తర్వాత మండలస్ధాయిలో ఈ నెల 13 నుంచి 20 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని, దీన్ని మరింత ముమ్మరంగా కొనసాగించాలని సజ్జల సూచించారు. అప్పుడే టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన దారుణ మోసం పట్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని, పార్టీ క్యాడర్కు కూడా ఇది అదనపు బలం అవుతుందని చెప్పారు.
మండల స్ధాయి తర్వాత జులై 21 నుంచి ఆగష్టు 4 వరకు నాలుగో దశలో గ్రామస్థాయిలో జరుగుతుందని సజ్జల అన్నారు. ఈ లోపు కమిటీల నియామకాలు అన్నీ పూర్తి చేయాలని, పార్టీలో చురుగ్గా పనిచేయాలనుకునే వారిని గుర్తించి కమిటీలలో అవకాశం ఇవ్వాలని చెప్పారు.
పార్టీ కేంద్ర కార్యాలయం, సీనియర్ నాయకుల సహకారం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని సజ్జల చెప్పారు. స్ధానిక సంస్ధలలో పదవుల్లో ఉన్న వారిని కూడా గుర్తించి పార్టీ కమిటీలలో ప్రాధాన్యమివ్వాలని నియోజకవర్గ నాయకులకు ఆయన సూచించారు. గ్రామ కమిటీల నియామకం పూర్తవగానే బూత్ కమిటీలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
అందరి డేటా, ప్రొఫైల్ అంతా కూడా సెంట్రల్ ఆఫీస్ నెట్వర్క్కు అనుసంధానించాలని, పార్టీ కార్యక్రమాలను సక్సెస్ చేయాలంటే అన్ని స్ధాయిలలోని నాయకులు చిత్తశుద్దిగా పనిచేసినప్పుడే విజయవంతం అవుతాయని అన్నారు. గ్రామ కమిటీలు కూడా ఆగస్టు నాటికి పూర్తవ్వాలని పేర్కొన్నారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications