సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది..సభ్యులు ఎవరు: రాజధాని నిర్ణయాన్ని ఆపగలదా: రూల్స్ ఏం చెబుతున్నాయి..!
ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావించి..బిల్లు పూర్తిగా ఆమోదం పొందకముందే విజయోత్సవాలు సైతం నిర్వహించింది. ఇప్పడు టీడీపీ పూర్తిగా మండలిలో తమకు ఉన్న మెజార్టీ..నిబంధనలను పూర్తిగా వినియోగించుకుంది. చివరకు మండలి ఛైర్మన్ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీ కి రిఫర్ చేసారు. దీంత..ప్రభుత్వానికి భంగపాటుగా భావిస్తున్నారు. దీంతో..అసలు ఇక సెలెక్ట్ కమిటీ ఏంటి.. సభ్యులుగా ఎవరు ఉంటారు. కమిటీ ఏం చేస్తుంది. రాజధాని నిర్ణయాన్ని మార్చగలదా. బిల్లుల పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. శాసన వ్యవస్థ రూల్స్ ఏం చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం ఏపీలో అటు రాజకీయంగానూ..ఇటు సాధారణ ప్రజల్లనూ సందేహాలకు కారణమవుతున్నాయి. అయితే ఈ కమిటీ పూర్తి నివేదిక ఇచ్చే వరకు రాజధానుల వ్యవహారం చట్టంగా మారే అవకాశం మాత్రం ఉండదు.
సెలెక్ట్ కమిటీ ఎలా ఉంటుంది..
శాసన మండలిలో మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ ఛైర్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల ప్రతినిధులతో ఛైర్మన్ ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. అయితే, టీడీపీ సభ్యులే మండలిలో మెజార్టీ ఉండటంతో..కమిటీలోనూ టీడీపీ సభ్యులకే ఎక్కవ మందికి అవకాశం దక్కుతుంది. అధికార వైసీపీ నుండి తొమ్మది మంది మాత్ర మే సభ్యులుగా ఉన్నారు. దీంతో..వారికి కమిటీలో ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది. ఇక, బీజేపీ ... ఉపాధ్యాయ.. పట్టభద్ర..స్వతంత్ర అభ్యర్ధుల నుండి ఇందులో అవకాశం కల్పిస్తారు. అయితే, ఈ కమిటీ ఏర్పాటు చేసిన తరువాత కమిటీ నెల రోజుల నుండి మూడు నెలల వరకు సమయం తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. అదే సమయంలో మధ్యలో మరోసారి సమయం కావాలంటే గడువు పెంచమని కోరే అధికారం సైతం ఈ కమిటీకి ఉంటుంది.

కమిటీ సభ్యులు ఏం చేస్తారు..
కమిటీ ఏర్పాటు అయిన తరువాత సభ్యులు ఈ రెండు బిల్లుల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు. బిల్లులో అభ్యంతర అంశాల పైన సమీక్షిస్తారు. బిల్లు స్వరూపాన్ని మార్చే అధికారం..మూలం తప్పించే అధికారం మాత్రం కమిటీకి ఉండదు. ఈ కమిటీ ఏపీలోని 13 జిల్లాల్లోనూ తిరిగి అభిప్రాయ సేకరణ చేసే అధికారం ఉంటుంది. అదే విధంగా..ప్రజా సంఘాలు.. ఇతర స్టేక్ హోల్డర్స్ నుండి సైతం అభిప్రాయాల సేకరణకు అధికారం ఉంటుంది. వీటి పైన పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత మండలి ఛైర్మన్ కు నివేదిక అందిస్తుంది. దీనిని మండలి ఛైర్మన్ తిరిగి శాసనసభకు పంపిస్తారు. శాసనసభ ఈ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను యధాతధంగా ఆమోదించాల్సిన అవసరం లేదు. సభ అభిప్రాయం మేరకు పరిగణలోకి తీసుకొని..తిరిగి బిల్లును ఆమోదించి..మరోసారి మండలికి ఆమోదం కోసం పంపిస్తారు. ఆ సమయం లో తిరిగి మండలి వ్యతిరేకించినా అది పరిగణలోకి రాదు. పూర్తిగా.. శాసనసభ నిర్ణయం మేరకు చట్టం అమల్లోకి వస్తుంది. మండలిలో మరోసారి సెలెక్ట్ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న బిల్లునే తిరిగి పంపినా..అది డీమ్డ్ టు బి యాక్సప్టెడ్ గా పరిగణిస్తారు. దీంతో..ఇప్పుడు ఈ కమిటీ ద్వారా మూడు రాజధానుల అమలు చట్టం రూపం దాల్చటానికి మరింత సమయం వేచి చూడక తప్పదు.
-
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..!












Click it and Unblock the Notifications