జగన్ను కలిసిన ప్రతిపక్షాల సీనియర్ నేత- నాలుగుసార్లు ఎమ్మెల్యేగా..!!
అమరావతి: మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటోన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పక్షాలు కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్నాయి. రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలని- ఆ ఒక్కటీ అమరావతే కావాలనీ డిమాండ్ చేస్తోన్నాయి. ఈ విషయంలో అమరావతి ప్రాంత రైతులను తెర మీదికి తీసుకొస్తోన్నాయి.
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్.. ఇలా అన్ని పార్టీలు కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఇదివరకు అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమాల్లో ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు స్వయంగా పాల్గొన్నారు. రాజధాని అమరావతికి 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాలరాస్తోందంటూ మండిపడ్డాయి.

ఈ పరిణామాల మధ్య సీపీఎం సీనియర్ నేత, మాజీ శాసన సభ్యుడు పాటూరు రామయ్య.. వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. క్యాంప్ కార్యాలయం అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. విజయవాడ స్వరాజ్ మైదాన్లో నిర్మిస్తోన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ స్మృతివనం పనులపై చేపట్టిన సమీక్ష ముగిసిన వెంటనే- వైఎస్ జగన్ ఆయనను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. అనంతరం పాటూరు రామయ్య ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. వైఎస్ జగన్ ను పాటూరు రామయ్య మర్యాదపూరకంగా కలిశారని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలుస్తోంది.
సీపీఎం సీనియర్ నేత పాటూరు రామయ్య.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. గతంలో ఆయన నాలుగుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. ఆయన సొంత నియోజకవర్గం- ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిడుమోలు. నెల్లూరు ఆయన సొంత జిల్లా. తన నియోజకవర్గంలో వేలాది మందికి ఇళ్ల స్థలాలను ఇప్పించారు. ఇప్పటికీ ఆయనకు సొంత ఇళ్లు లేదు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications