కోర్టుకు కాల్ డేటాలను సమర్పించిన సర్వీస్ ప్రొవైడర్లు
విజయవాడ: ఫోన్ట్యాపింగ్ కేసులో డొకొమో, వోడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్డేటాను శుక్రవారం కోర్టుకు అందజేశారు. ఇప్పటికే ఐడియా, ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్లు 29 నెంబర్ల కాల్డేటాను కోర్టుకు ఇచ్చారు. దీంతో కోర్టు తుదుపరి విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్పై మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బిఎస్ఎన్ఎల్, ఐడియా, భారతి ఎయిర్టెల్ సంస్థలు కాల్ డేటా వివరాలను ఆగస్టు 14వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ కేసులో కూడా విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ కోర్టు తనకు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఇచ్చిన కాల్ డేటా వివరాలను చూడకుండా సీల్డ్ కవర్ను యథాతథంగా హైకోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్పుర్కార్ ఆదేశించారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications