వివేకా కేసులో సునీతకు సుప్రీం షాక్- సీబీఐకి కీలక ఆదేశం..!
ఏపీలో ఏడేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్యపై సీబీఐ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించగా.. దాన్ని వ్యతిరేకిస్తూ మరిన్ని అంశాలపై దర్యాప్తు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి కోరడం జరిగింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఆమె ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ట్రయల్ కోర్టు తీర్పు తర్వాత కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు అక్కడా ఊరట దక్కలేదు.
గతంలో జరిగిందేంటి ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నాలుగేళ్ల తర్వాత దాన్ని పూర్తి చేసి అనంతరం గతేడాది సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. అనంతరం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అనంతరం సీబీఐ కోర్టుకు వెళ్లిన సునీత.. తన తండ్రి హత్య కేసులో చాలా అంశాల్ని సీబీఐ వదిలేసిందని పేర్కొంది. అయితే దీనిపై సీబీఐ కోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో రెండు అంశాల వరకే సీబీఐ దర్యాప్తును పరిమితం చేసింది.

యథాతథంగా సీబీఐ దర్యాప్తు
దీంతో మరోసారి వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ తదుపరి దర్యాప్తు జరిపేలా అనుమతి ఇచ్చింది. ఇంతకు మించి సునీత కోరుతున్నట్లుగా దర్యాప్తు చేయించేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో సునీతకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న ఉత్తర్వును మాత్రం సవరించి సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తును మాత్రం యథాతథంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications