సిగ్మా క్యాబ్స్ ఎండి తనయుడి కిడ్నాప్, సుఖాంతం
హైదరాబాద్: సిగ్మా క్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కుమారుడు అశ్విన్ కుమార్ (17) కిడ్నాప్ అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అశ్విన్ కుమార్ను ఇన్నోవా కారులో ఎక్కించుకుని పారిపోయారు. ఈ ఘటన హైదరాబాదులోని రైతిబౌలి పిల్లర్ నంబర్ 45 వద్ద చోటు చేసుకుంది.
సిగ్మా క్యాబ్స్ ఎండీ కుటుంబ సభ్యులు లంగర్హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అశ్విన్ కిడ్నాప్ కు వ్యాపార విభేదాలే కారణమని తెలుస్తోంది. ఈ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. అశ్విన్ కుమార్ను దుండగులు టోలీచౌక్ వద్ద వదిలి వెళ్లారు. చెక్ వివాదమే ఈ కిడ్నాప్నకు కారణమని తెలుస్తోంది. కిడ్నాపర్లలో ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే, హైదరాబాదులోని మియాపూర్ మదీనగూడలోని పూజిత అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగింది. వరుసగా 5 ఫ్లాట్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారం, రూ. 10 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈతకు వెళ్లి విద్యార్థుల మృతి
రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలం కుందనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాల్వలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు కాప్రాకు చెందిన సాయికుమార్(20), శివ(18)గా గుర్తించారు.