విదేశీ ఆస్తుల చిట్టా, ఆధారాలు: కాకానికి 24 గం.ల టైమిచ్చిన సోమిరెడ్డి, లేదంటే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాకానికి 24 గంటల డెడ్ లైన్ విధించారు. తన పైన ఫిర్యాదు చేయాలని, లేదంటే తాను కాకాని గుట్టు రట్టు చేస్తానన్నారు.
'మీరే అంతమవుతారు, మొరగడం ఆపండి, పెట్రోలు లేకుండా తగలబెడతా'
తన పైన చేసిన ఆరోపణలకు కాకాని 24 గంటల్లో పోలీసులకు తన పైన ఫిర్యాదు చేయాలని సోమిరెడ్డి అన్నారు. లేదంటే తానే కాకాని పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కాకాని వెనుక ఉన్న నకిలీ డాక్యుమెంట్ల గుట్టు రట్టు చేస్తానన్నారు. తన నలభై ఏళ్ల జీవితంలో ఇలాంటి దిగజారుడు రాజకీయ నేతను చూడలేదన్నారు.
కాగా, తాను పేదవాడిని అని, రాజకీయాల్లోకి వచ్చి ఉన్న ఆస్తులను అమ్ముకున్నానని సోమిరెడ్డి చెబుతుంటారని, విదేశాల్లో అక్రమాస్తులు ఎలా కూడబెట్టారని కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు.
విదేశాల్లో అక్రమాస్తులే కాకుండా కర్నాటకలో పవర్ ప్రాజెక్టులోను రూ.30 కోట్ల పెట్టుబడులు ఉన్నాయన్నారు. కర్నాటకలోని సాగర్ పవర్ కంపెనీ లిమిటెడ్లో సోమిరెడ్డి సతీమణి జ్యోతి డైరెక్టరుగా ఉన్నారని, వారి పెట్టుబడులు రూ.30 కోట్లు ఉన్నాయని ఆరోపించారు.
'వంగవీటి' ఎవరి చెప్పు చేతల్లో..: 24 గం.ల డెడ్లైన్, హెచ్చరిక
ఇందుకు సంబంధించిన ఆధారాలు అని చెబుతూ కంపెనీ డైరెక్టర్ల పత్రాన్ని మీడియా ముందు పెట్టారు. నిత్యం పేదవాడిని, పూట గడవదు అని చెప్పే సోమిరెడ్డికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.
సోమిరెడ్డిపై తాను చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలున్నాయన్నారు. సోమిరెడ్డి డొంకతిరుగు సమాధానాలు చెబుతున్నారన్నారు. సోమిరెడ్డి పెట్టుబడులపై త్వరలో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. సోమిరెడ్డి పలు విదేశీ సంస్థలతో లావాదేవీలు చేశారన్నారు. సోమిరెడ్డి లావాదేవీలపై సిబిఐతో విచారణ జరిపించాలన్నారు.