నెల్లూరు, సూళ్లూరుపేట ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్..!
విజయవాడ డివిజన్ పరిధిలోని నెల్లూరు, సూళ్లూరు పేట స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇవి తాత్కాలికం మాత్రమే. కాబట్టి ఈ రెండు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దయ్యాయో తెలుసుకొని ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది.
నెల్లూరు-సూళ్లూరు పేట రైల్వే మార్గంలో ప్రస్తుతం సిబ్బంది ట్రాఫిక్ నిర్వహణ పనులు చేస్తున్నారు. దీని కారణంగా ఈ రెండు స్టేషన్ల మధ్య ఈ నెల 10 (ఇవాళ), 12వ తేదీ (ఎల్లుండి) రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేసారు. ఈ పనులు పూర్తి కాగానే ఈ రెండు రైళ్లు తిరిగి యథావిధిగా రాకపోకలు సాగించబోతున్నాయి. దీంతో ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

నెల్లూరు-సూళ్లూరు పేట మార్గంలో ఈ మధ్య కాలంలో రైల్వేశాఖ పలు మరమ్మత్తులు చేపడుతోంది. ట్రాక్ పటిష్టతతో పాటు ఇతర నిర్వహణ పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా రైళ్ల రాకపోకల్లో తాత్కాలికంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వీటిని గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications