దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణ: ఒడిలో కూర్చోబెట్టుకొన్న బాబు, ముద్దుచేసిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ కార్యక్రమంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనుమడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ కార్యక్రమంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనుమడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబానికి చెందిన పలువురు హజరయ్యారు.ఈ కార్యక్రమంలో లోకేష్ , బ్రహ్మణిల తనయుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఆదివారం నాడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు.కొత్త మంత్రులు ప్రమాణం చేస్తోంటే దేవాన్ష్ ను తన ఒడిలో కూర్చోపెట్టుకొని మనమడి గురించి నేతలకు చెప్పడం కన్పించింది.
కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో చంద్రబాబునాయుడు చాలా ఉల్లాసంగా కన్పించారు. ఆయన పక్కనే ఉన్న గవర్నర్ నరసింహన్ కూడ దేవాన్ష్ తో సరదాగా గడిపారు.












Click it and Unblock the Notifications