సీఎం సహాయనిధికి శ్రీనివాస ట్రస్టు రూ.2 కోట్ల భారీ విరాళం...!
హైదరాబాద్: మాజీ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని శ్రీనివాస ట్రస్టు ఈరోజు సీఎం సహాయ నిధికి భారీ విరాళాన్ని అందజేసింది. రైతు సాధికారత సదస్సు ప్రారంభోత్సవం కోసం చిత్తూరుకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకు రూ.2,04,17,000 చెక్కును దివంగత డీకే ఆదికేశవులునాయుడు సతీమణి, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అందజేశారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులునాయుడు రెండేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. ఆయన జ్ఞాపకార్థం శ్రీనివాస ట్రస్టు తరఫున సత్యప్రభ ఈ భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

చిత్తూరు బహిరంగ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తనది ఇచ్చిన మాట తప్పేతత్వం కాదని, రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన ఉద్దేశ్యమని అన్నారు. రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాలేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో రైతులకు మొదటిసారి న్యాయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ పత్రాలు అందించారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications