రావాలని ఉన్నా, తొక్కిసలాట కారణంతో రాలేకపోతున్నా:పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని ఘాట్ వద్ద జరిగిన విషాదం పైన స్పందించారు. తొక్కిసలాట కారణంగా 27 మంది వరకు మృతి చెందారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు.
మంగళవారం నాడు పుష్కరాల సందర్భంగా జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని, గాయపడిన వారికి సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు.
తనకు సంఘటన స్థలానికి వచ్చి ప్రత్యక్షంగా పరామర్శించి, సహాయక చర్యలలో పాల్గొనాలని ఉందని కానీ, తాను రావడం వల్ల మళ్లీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించినందు వల్లే మిన్నకుండిపోయానని ట్వీట్ చేశారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈరోజు
పుష్కరాలలో
జరిగిన
దుర్ఘటన
నన్ను
తీవ్రంగా
కలచి
వేసింది.
గాయపడిన
వారికి
నా
సానుభూతి
తెలియ
జేస్తున్నాను.
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
14,
2015
..చనిపోయిన
వారి
ఆత్మకు
శాంతి
కలగాలని
ఆశిస్తూ..వారి
కుటుంబాలకు
నా
ప్రగాఢ
సానుభూతిని
తెలియ
జేస్తున్నాను.
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
14,
2015
అక్కడకు
వచ్చి
వారిని
ప్రత్యక్షంగా
పరామర్శించి
సహాయక
చర్యలలో
పాల్గొనాలని
ఉన్నా..
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
14,
2015
దానివల్ల
మళ్ళీ
తొక్కిసలాట
జరిగి
ప్రజలకు,
ప్రభుత్వ
సహాయక
చర్యలకు
ఇబ్బంది
కలుగుతుందని
భావించి
రావటం
విరమించుకున్నాను.
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
14,
2015
సహాయక
చర్యలకు
తోడ్పాటు
అందించ
వలసినదిగా
'జనసేన'
కార్య
కర్తలకు
విజ్ఞప్తి
చేస్తున్నాను.
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
14,
2015