రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రావాలని ఉన్నా, తొక్కిసలాట కారణంతో రాలేకపోతున్నా:పవన్ కళ్యాణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని ఘాట్ వద్ద జరిగిన విషాదం పైన స్పందించారు. తొక్కిసలాట కారణంగా 27 మంది వరకు మృతి చెందారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు.

మంగళవారం నాడు పుష్కరాల సందర్భంగా జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని, గాయపడిన వారికి సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు.

Pawan Kalyan

తనకు సంఘటన స్థలానికి వచ్చి ప్రత్యక్షంగా పరామర్శించి, సహాయక చర్యలలో పాల్గొనాలని ఉందని కానీ, తాను రావడం వల్ల మళ్లీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించినందు వల్లే మిన్నకుండిపోయానని ట్వీట్ చేశారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

English summary
Stampede at Godavari Pushkaralu in AP: Pawan Kalyan says he want to come Rajahmundry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X