కూటమి సర్కార్ పై అసెంబ్లీలో సుజనా అసంతృప్తి- ఆ మూడు విషయాల్లో..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే విపక్ష వైసీపీ మాత్రం హోదా ఇవ్వలేదనే కారణంతో సభకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలతోనే సభను నడుపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ పోషించాల్సిన విపక్ష పాత్రను కూటమి పార్టీల ఎమ్మెల్యేలే పోషిస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్న చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా మాట్లాడటంపై సీఎం చంద్రబాబు నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇవాళ కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఓ మూడు కీలక అంశాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. వీటిలో అమరావతి రైతుల సమస్యలు ఒకటి కాగా, విశాఖలోని రుషికొండ భవనాల వ్యవహారం మరొకటి, రాష్ట్ర ఎన్నికల సంఘంలో వైసీపీ అనుకూల ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చిన వ్యవహారం ఇంకొకటి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్గించిన సాయిప్రసాద్ అనే ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి కీలక బాధ్యతలు ఇవ్వడం కరెక్టేనా అని సుజనా చౌదరి ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నించారు. అలాగే గత అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి రైతుల ఆర్తనాదాలు గత ఐదేళ్లు తాను చూశానని తెలిపారు. ప్రభుత్వం వచ్చి 15 నెలలవుతున్నా వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.

గత సమావేశాల్లో స్పీకర్ 2 గంటలు సమయం ఇచ్చి చర్చిద్దామన్నారని, కానీ ఇప్పటివరకూ అది జరగలేదన్నారు. కాబట్టి ఇప్పటికైనా అమరావతి రైతుల సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు విశాఖలో రుషికొండ ప్యాలెస్ పై చదరపు అడుగుకు 26 వేలు ఖర్చుపెట్టారని, దుబారా చేశారని మాట్లాడారని, అలాగే పర్యావరణ ఉల్లంఘనలు కూడా జరిగాయని సుజనా గుర్తుచేశారు. అయినా ఇప్పటికీ కూటమి సర్కార్ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వచ్చి ఇంతకాలం జరుగుతున్నా పాత ప్రభుత్వంలో అధికారులు, పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు.
-
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!











Click it and Unblock the Notifications