Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!!

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఎన్జీటీ విధించిన పెనాల్టీని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో అప్పీల్ కు వెళ్లిన ఓ పిటీషన్ పై ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జాయింట్ కమిటీ చేసిన సిఫారసులను సుప్రీంకోర్టు తాజాగా మరోసారి సమర్థించింది. నష్ట పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.

ఎన్జీటీ..

ఎన్జీటీ..

పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ..ప్రాజెక్టుల నిర్మాణ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకుందంటూ ఇదివరకు ఎన్జీటీ జాయింట్ కమిటీ నిర్ధారించింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందున ఆయా ప్రాజెక్టుల వారీగా జరిమానాను విధించింది.

ప్రాజెక్టులవారీగా..

ప్రాజెక్టులవారీగా..

పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో ప్రభుత్వం యథేచ్ఛగా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘంచినట్లు పెంటపాటి పుల్లారావు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మేడిచెర్ల సత్యనారాయణ, జమ్ముల చౌదరయ్య ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీన్ని విచారించిన ఎన్జీటీ- ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పర్యావరణ నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు- 2 కోట్ల 48 లక్షల రూపాయలు, పట్టిసీమ ప్రాజెక్టు- కోటి 90 లక్షల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

సమర్థించిన సుప్రీం..

సమర్థించిన సుప్రీం..

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏకంగా 120 కోట్ల రూపాయల పరిహారాన్నివిధించింది. ఈ మొత్తాన్ని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఎన్జీటీ జాయింట్ కమిటీ- ప్రభుత్వానికి ఆదేశిచింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

రూ.120 కోట్లు..

రూ.120 కోట్లు..

విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు- 2 కోట్ల 48 లక్షల రూపాయలు, పట్టిసీమ ప్రాజెక్టు- కోటి 90 లక్షల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటి విధించిన 120 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపును మరోసారి విచారిస్తామని స్పష్టం చేసింది.

మూడువారాలకు వాయిదా..

మూడువారాలకు వాయిదా..

జరిమానా చెల్లింపులపై తమకు రెండు వారాల సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో జరిమానా చెల్లించారా? లేదా? అనే అంశంపై నివేదిక అందజేయాలని లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. మూడు వారాల తరువాత ఈ పిటీషన్ పై మరోసారి విచారణకు చేపడతామని తెలిపింది. పోలవరంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+