జగన్ నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి, బాధించింది: ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కర్నూలు దీక్ష పైన తనకు సమాచారం ఇవ్వకపోవడం బాధించిందని, ఆయన నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంటాయని టిడిపిలో చేరిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.
జగన్ భవిష్యత్తు గురించి నేను ఏం చెప్పనని అన్నారు. జగన్ నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంటాయన్నారు. భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు పార్టీ మారినప్పుడు తన పైన ఒత్తిడి పెరిగిందన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు.
మా తండ్రి సుబ్బారెడ్డి పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. టీజీ వెంకటేష్తో తాను సమన్వయం చేసుకుంటానని చెప్పారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారో లేదో తనకు తెలియదని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో తెలియదన్నారు.

తనకు టిడిపి నుంచి రూ.100 కోట్ల అభివృద్ధికి హామీ వచ్చిందని చెప్పారు. కర్నూలు దీక్ష పైన జగన్ తనకు సమాచారం ఇవ్వలేదని, ఇది తనను బాధించిందని చెప్పారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని పార్టీ మారుతున్నారని వైసిపి నేతలు చెప్పడం సరికాదన్నారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమేై పార్టీ మారుతున్నానని, అలాంటప్పుడు కర్నూలు ప్రజలు తనను ఎందుకు తిడతారని ప్రశ్నించారు. తమది మొదటి నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబమేనని, తనకు ఎలాంటి అప్పులు లేవని చెప్పారు.
ప్రత్యేక హోదా రాకుంటే ఏపీకి నష్టమేనని చెప్పారు. అఖిల ప్రియ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారని కితాబిచ్చారు. కాగా, ఎస్వీ మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిపొందారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications