చంద్రబాబుXలోకేష్ లేదా గెలిచే వారికి టిక్కెట్: కర్నూలుపై ఎస్వీ వర్సెస్ టీజీ భరత్
కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వేడి రాజేస్తోంది. ఇక్కడి నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని గతంలో మంత్రి నారా లోకేష్ ప్రకటించినప్పుడు ఎంపీ టీజీ వెంకటేష్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. కర్నూలు సీటుపై ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ (టీజీ వెంకటేష్ తనయుడు) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

కర్నూలు నుంచి లోకేష్ పోటీ చేస్తే నేను త్యాగం చేస్తా
కర్నూలు స్థానం నుంచి మంత్రి నారా లోకేష్ పోటీ చేయాలని ఎస్వీ మోహన్ రెడ్డి ఆదివారం విజ్ఞప్తి చేశారు. లోకేష్ కోసం తాను సీటును త్యాగం చేస్తానని చెప్పారు. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేస్తే తాను మరోచోట సీటు అడగనని, పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు. కానీ కర్నూలు లోకసభ సీటు వేరేవాళ్లకు ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పారు.

చంద్రబాబు పోటీ చేయాలి... టీజీ భరత్ కౌంటర్
మంత్రి నారా లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేయాలని ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నారని, కానీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి పోటీ చేయాలని తాను గత ఏడాదే కోరానని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ గుర్తు చేశారు. చంద్రబాబు వల్లే నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి అవుతోందని టీజీ భరత్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి కర్నూలు నుంచి పోటీ చేస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తే 75వేల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. అంతేకాకుండా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపిస్తామన్నారు.

లేదంటే గెలిచే వారికి టిక్కెట్
కర్నూలు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, కుప్పం నుంచి లోకేష్ పోటీ చేయాలని టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ముఖ్యమంత్రి పోటీ చేయకుంటే గెలిచే వారికి టిక్కెట్ ఇవ్వాలని చెప్పారు. కర్నూలు సీటుపై తెలుగుదేశం పార్టీలో మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు, లోకేష్లు ఇక్కడి నుంచి పోటీ చేస్తే తమకు అభ్యంతరం లేదని, తాము పార్టీ కోసం పని చేస్తామంటూ నేతలు చెబుతున్నారు. కానీ వారు పోటీ చేయకుంటే మాత్రం తమకే టిక్కెట్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications